ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రవీంద్ర...ఏపీ సీఎం సెక్యూరిటీ కోసమా ?

 

ఏపీ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లీయర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతించింది. దీంతో రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్‌ను  తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ఆ తర్వాత స్టీఫెన్ ను ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారు. 

నిజానికి స్టీఫెన్ రవీంద్ర తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ గల ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో మొదటగా వరంగల్ జిల్లా పరకాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2004లో ఆడిషనల్ ఎస్పీగా అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పని చేశారు. తర్వాత, వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. వరంగల్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీగా బదిలీ అయిన తర్వాత అక్కడి ఫ్యాక్షన్ ను కంట్రోల్ చేసి మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. 

తరువాత అప్పటి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌‌గా పని చేయడంతో పాటు  వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయన మారారు. వైఎస్ మరణానంతరం 2009లో కరీంనగర్ ఎస్పీగా ఆయన భాద్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ డీసీపీగా భాద్యతలు చేపట్టారు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఓయూలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కట్టడి చేయగలిగారు.

ఇక ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు. రెండు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు ఇప్పుడు ఆయన ప్లేస్ లోనే ఈయన ఛార్జ్ తీసుకోనున్నారని అంటున్నారు. నిజానికి గతంలో ఈ పదవిలో ఏబీ వెంకటేశ్వరరావు ఉండేవారు. చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తుండేవి. 

పోలీసు అధికారిగా కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్‌ కేటాయించాలో ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ వెంకటేశ్వరరావు చెబితేనే సీఎం అమలు చేస్తాడని వైసీపీ ఆరోపించింది. అంతే కాక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏబీ కీలక పాత్ర పోషించారని కూడా విమర్శలున్నాయి. పోలీస్‌ అధికారిగా కాకుండా బాబు పార్టీ కార్యకర్తగా ఆయన పని చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మరి అలాంటి కీలక పదవిలో తమకి అనుకూలంగా సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న స్టీఫెన్ రవీంద్రని తెచ్చి పదవిని కట్టబెట్టడం ఎంతవరకు లాభిస్తుందో చూడాలి మరి.

Teluguone gnews banner

అంచనాలకు భిన్నంగా బీహార్ ఎగ్జిట్ పోల్స్!

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడో ఒకప్పుడు తప్పుతుంటాయ్ తప్ప.. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జాక్ట్ పోల్స్‌కు దగ్గరగానే ఉంటాయి. బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికారం చేపట్టబోతోందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. అంతా అనుకున్న దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కనిపించడంతో.. బీహార్ ప్రజలు ఇంత కమిటెడ్‌గా తీర్పు ఇవ్వడమేంటనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అందరి ఫోకస్ ఇప్పుడు యువ నాయకుడు తేజస్వి యాదవ్ రాజకీయ భవిష్యత్ పైనే ఉంది. ఎన్నికల ప్రచారంలో  ఆయన చూపించిన దూకుడు, యువతను ఆకట్టుకోవడంలో సాధించిన సక్సెస్, ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమిని ముందుకు నడిపించిన తీరు.. తలపండిన రాజకీయ నేతలను, పరిశీలకులను సైతం విస్మయపరిచింది. కచ్చితంగా.. తేజస్వి నాయకత్వంలో.. బీహార్‌లో మహాఘట్‌బంధన్ అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తుందనుకున్నారంతా. కానీ, ఎగ్జిట్ పోల్స్ వచ్చాకే.. బీహార్‌లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో అందరికీ అర్థమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ.. దాదాపుగా ఎన్డీయేకే మొగ్గు చూపడంతో.. అంతా అవాక్కయ్యారు.  అయితే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు ఎగ్జిట్ పోల్స్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఫలితాలు వచ్చినప్పుడు ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే 125 సీట్లు గెలుచుకోగా, మహాకూటమి 110 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ  మాత్రం అత్యధికంగా 75 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, వాస్తవ ఫలితాలకు.. పెద్ద తేడా వచ్చింది. ఈసారి కూడా ఎన్నికలు హోరాహోరీగా సాగడంతో, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చనే ఆశ  మహా‌ఘట్‌బంధన్ క్యాంప్‌లో ఇప్పటికీ ఉంది. ఏదేమైనా, ఈ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఓ రైజింగ్ స్టార్‌గా నిలిచారు. ఆయన జీవితంలో.. 2025 బీహార్ ఎన్నికలు.. ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయ్. బీహార్‌ పాలిటిక్స్‌లో.. నితీశ్ కుమార్ తర్వాత అంతటి బలమైన, ప్రజలను ఆకట్టుకోగల నేతగా తేజస్వి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా.. యువతని ఆకట్టుకోవడంలో తేజస్వి సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి కల్పన అస్త్రంతో జనంలోకి వెళ్లారు. బీహార్ యువత, ముఖ్యంగా నిరుద్యోగులు భారీ ఎత్తున.. తేజస్వి యాదవ్ ప్రచారానికి తరలివచ్చారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. ఓ గేమ్ ఛేంజర్‌గా మారింది.  తేజస్వి యాదవ్.. మహాఘట్‌బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా  దాదాపు ఒంటరి పోరాటాన్ని నడిపించారు. నితీశ్ కుమార్, ప్రధాని మోడీ లాంటి అగ్ర నేతల ఉమ్మడి శక్తిని ఎదుర్కొని కూడా ప్రచారంలో బలంగా నిలబడ్డారు. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. ఆర్జేడీ అంటే కేవలం ముస్లిం-యాదవ్ ఓట్ బ్యాంక్ అన్న అపవాదును తొలగించడానికి తేజస్వి ప్రయత్నించారు. ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలకు పెద్దపీట వేసి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశారు. అయినప్పటికీ.. బీహార్ ప్రజలు ఎందుకు తేజస్వి యాదవ్‌కి మద్దతుగా నిలవలేకపోయారనే చర్చ మొదలైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై,  మహాఘట్‍‌బంధన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. మరో ఐదేళ్లు తేజస్వి అపొజిషన్‌కే పరిమితం అవుతారు. అధికారంలోకి వస్తామనే ఆశల నుంచి, మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవడం అనేది.. తేజస్వి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపే చాన్స్ కూడా ఉందంటున్నారు. అయితే.. ఆర్జేడీ మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశం ఉన్నందున తేజస్వి యాదవ్ బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషిస్తారా? అధికారం దక్కలేదని కుంగుబాటుకు గురవుతారా? అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. తేజస్వి యాదవ్ వయసు 40 ఏళ్ల లోపే ఉంది. రాజకీయంగా ఇది చాలా చిన్న వయసు. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు. నితీశ్ కుమార్ వయసు పెరుగుతోంది కాబట్టి.. రాబోయే రోజుల్లో తేజస్వికే ఎక్కువ అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

మదనపల్లిలో కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు

  అన్నమయ్య జిల్లా మదనపల్లిలో  కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. పట్టణంలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్‌ బయటకొచ్చింది. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  వైజాగ్‌కు చెందిన పద్మ అనే మహిళ.. మరో ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. వారికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించారు. ఆపరేషన్ తర్వాత యమున అనే మహిళ మృతిచెందింది.  అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రి వైద్యులను అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్‌లో కీలక నిందితుడు రాకేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్‌ డాక్టర్‌ ఆంజనేయులు కోడలు డాక్టర్‌ శాశ్వతి గ్లోబల్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నీ రాకెట్ వెనుక మదనపల్లె డయాలసిస్‌ కేంద్రం మేనేజర్‌ బాలు, పుంగనూరు డయాలసిస్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ నాయక్‌ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. డాక్టర్‌ శాశ్వతి ఈ ముఠాతో కలిసి కిడ్నీ మార్పిడులకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. డయాలసిస్‌ సెంటర్‌కు వచ్చే ధనవంతులను టార్గెట్‌ చేసి, కిడ్నీ అవసరమైన పేషెంట్లకు కొత్త కిడ్నీలు దొరుకుతాయని నమ్మబలికే ఈ రాకెట్‌ నడిపారు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేశ్‌ సంప్రదించారు. కిడ్నీ ఇస్తే రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. యమున కిడ్నీని మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రిలో సేకరించి, గోవాలోని ఒక వ్యక్తికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. నవంబర్‌ 9న ఆపరేషన్‌ జరుగుతుండగా, యమున మూర్చపడి మృతిచెందింది. ఈ ఘటనను గ్లోబల్‌ ఆసుపత్రి నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచి 112కి ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసుల సమాచారంతో మదనపల్లె టూ టౌన్‌ పోలీసులు గ్లోబల్‌ ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడే ఉన్న మేనేజర్లు బాలు, వెంకటేశ్‌ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వైజాగ్‌కు చెందిన బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

పవన్‌ తిరుపతి పర్యటనపై విమర్శలు... ఎమ్మెల్యేలను కలిసే భాగ్యం లేదా?

  డిప్యూటీ సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే స్థానిక నాయకులు కూడా ఇతర పర్యటనలు మానుకొని ఆయన్ను కలవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇటీవల పవన్‌ కల్యాణ్‌ తిరుపతి జిల్లా పర్యటనలో మాత్రం ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన.. నేరుగా మాముండూరు అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అక్కడ అధికారుల నుంచి వివరాలు సేకరించి, వాచ్ టవర్ నుంచి పరిసరాలను పరిశీలించారు.  అనంతరం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మాముండూరు అటవీ ప్రాంతం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ఉపముఖ్యమంత్రిని కలిసి పలు కీలక సమస్యలను ప్రస్తావించాలని సిద్ధమయ్యారు. ముఖ్యంగా రేణిగుంట, ఏర్పేడు అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న వన్యప్రాణుల దాడుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై అటవీ శాఖ నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలను ఆయన దృష్టికి తీసుకురావాలనుకున్నారు.  బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం కోసం అటవీ భూముల సేకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనే విషయాన్ని పవన్‌కు వివరిద్దామనుకున్నారట. అంతేకాదు.. శ్రీకాళహస్తి ఆలయం సమీపంలోని కొండలపై చెట్ల పెంపకానికి అటవీ శాఖ తీసుకోవాల్సిన చర్యలపైనా ఆయనతో డిస్కస్‌ చేద్దామని రెడీ అయ్యారట. అయితే పవన్‌ వ్యక్తిగత సిబ్బంది నుంచి ఆ టూర్‌కు ఎవరూ రావాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. దాంతో బొజ్జల సుధీర్‌ రెడ్డి పవన్‌ టూర్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.  ఇక తిరుపతిలో జరిగిన అటవీ శాఖ రివ్యూ సమావేశానికి సైతం స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించినప్పుడు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు హాజరై తమ నియోజకవర్గ సమస్యలను చెబుతుంటారు. కానీ, ఇక్కడ జనసేన తిరుపతి ఎమ్మెల్యేను సైతం సమావేశంలోకి రానివ్వలేదట. దీంతో ఆయన పక్క గదిలో ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్న అటవీ శాఖ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సిద్ధమైనా అది సాధ్యపడలేదు.  హాస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ హారి ప్రసాద్ కూడా ఎర్రచందనాన్ని హాస్తకళల కార్పొరేషన్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేసుకున్నారు. కానీ, ఆయన్ని కూడా కలవడానికి అవకాశం దక్కలేదనే టాక్ ఉంది. ఇక రెండవ రోజు పర్యటనలోనూ ఇదే పరిస్థితి ఎదురైందట. పలమనేరుకు వచ్చిన ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ వచ్చారు.  అయితే, రైతులతో సమావేశం అవుతారని ముందుగా చెప్పినా, డిప్యూటీ సీఎం నేరుగా మొసలిమడుగు ఏనుగుల క్యాంపుకు వచ్చి అధికారుల సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఏనుగుల దాడుల గురించి వివరించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదనే చర్చ నడుస్తోంది. ఏనుగుల దాడులతో అల్లాడిపోతున్న తమ మాటలు కనీసం అటవీ మంత్రిగా పవన్ కల్యాణ్ వింటారని ఆశించిన రైతులకు ఈ పర్యటన నిరాశనే మిగిల్చింది. ఏనుగుల బాధితులు ఏడాదిన్నర తర్వాత తమ కష్టాలు వినడానికి మంత్రి వస్తున్నారని ఆశగా వచ్చారు.  పంట నష్టం కొద్దిగా జరిగితే, పరిహారం అంతకంటే తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి ఒక్కోసారి రైతులు విద్యుత్ వైర్లను వేయడం, అటవీ జంతువులు చనిపోవడంతో రైతులపై కేసులు పెడుతున్నారని వారు వాపోతున్నారు. అటవీ శాఖ లెక్కల ప్రకారమే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు చెబుతున్నా, పరిహారం విషయంలో నిర్లక్ష్యం ఉందనే విమర్శలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో తమ గోడు చెప్పుకుందామని వచ్చిన రైతులకు ఉపముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉపముఖ్యమంత్రి సమక్షంలో అధికారులకు తమ సమస్యలు వినిపించుకుందామనుకున్న రైతులకు, అధికారులకు వార్నింగ్ ఇద్దామని భావించిన స్థానిక ప్రజా ప్రతినిధులకు నిరాశ మిగిలింది. ఈ పర్యటన స్థానిక జనసేన క్యాడర్‌కు సైతం నిరాశ కలిగించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు వ్యూహం.. జాతీయ నేతగా లోకేష్ అడుగులు!

రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ముందు ముందు జాతీయ స్థాయిలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించానున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే తన పనితీరుతో లోకేష్ రాష్ట్రంలో అన్ని వర్గాలకూ చేరువ అయ్యారు. గతంలో విమర్శలు చేసిన వారు కూడా ఇప్పుడు లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయంగా పరిణితి చెందారన్న అభిప్రాయమూ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ఇటు ప్రభుత్వంలోనూ, అటు తేలుగుదేశం పార్టీలోనూ తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. ఇక ప్రజలలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరో లెవల్ కు చేరింది.  ప్రజానాయకుడిగా జనం ఆయనను భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం భవిష్యత్ నాయకుడిగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.   ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకూ లోకేష్ అన్ని వర్గాల, అన్ని పార్టీల నుంచీ కూడా మంచి నేతగా గుర్తింపు పొందారు.  ఇక ఇప్పుడు ఆయనను జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హస్తిన, ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఆయనకు గుర్తింపు లభించేలా ఒకదాని వెంట  ఒకటిగా లోకేష్ వేస్తున్న అడుగుల వెనుక  చంద్రబాబు స్ట్రాటజీ ఉందని   పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ లోకేష్ అడగకుండానే అప్పాయింట్ మెంట్లు ఇస్తున్నారు. అలాగే కేంద్ర కేబినెట్ లోని పలువురు మంత్రులతో లోకేష్ కు మంచి పరిచయాలు, అనుబంధం, సాన్నిహిత్యం ఏర్పడింది. తరచుగా వారి సూచనలు, సలహాలూ తీసుకుంటూ వారికి చేరువ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా తాను వెళ్లకుండా లోకేష్ ను పంపించారు. అక్కడ ఆయన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.  బీహార్ ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సహా పలువరు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అంతటి కీలకమైన బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి   నారా లోకేష్ వెళ్లడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ ప్రచారం ఆయనకు జాతీయ నేతగా వస్తున్న గుర్తింపును మరో మెట్టు పైకి తీసుకువెడుతుందని అంటున్నారు.     

భలే మంచి ఓటు బేర‌మూ!

హైద‌రాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న ఓట‌ర్ల‌లో ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ లో ఉన్న ఓట‌ర్లు మాత్రం దేవుళ్ల‌తో స‌మానం.. కార‌ణం అంద‌రికీ తెలిసిందే. ఈ ఎన్నిక ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ  పార్టీలకు చావోరేవో పరిస్థితి.  అధికార కాంగ్రెస్ ఇక్కడ గెలవకుంటే  అధికారంలో ఉండీ లేన‌ట్టే అని భావిస్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ ఇక్కడ ఓటమి పాలైతే.. రాష్ట్రంలో ఇక ఉనికి కోల్పోయినట్లే అని భయపడుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. 2028లో అధికారంలోకి రావాలన్న ఆశ అడియాశ అయినట్లే అని బెంబేలెత్తే పరిస్థితి.  ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో విజయం సాధిస్తే.. 2028 ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడానికి రాచబాట వేసుకున్నట్లే అన్న నమ్మకంతో ఉంది.  ఎందుకంటే జూబ్లీ బైపోల్ లో బీజేపీకి డిపాజిట్ వస్తే ఆ పార్టీకి గెలుపుతో సమానం అని ఎద్దేవా చేశారు.   అంతే కాదు ఇక్క‌డ బీజేపీ త‌న డిపాజిట్లు కోల్పోతే.. కేంద్రంలో మోడీ స‌ర్కార్ పాలనకు ఇది  రెఫ‌రెండంగా భావిస్తారా? అని స‌వాల్  కూడావిసిరారు.  ఇక స‌ర్వేలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుంటే,  దానిపై కూడా రేవంత్ సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. ఆయా స‌ర్వే కంపెనీల వారు.. ఆయా పార్టీల నుంచి డ‌బ్బు తీసుకుని ఆయా పార్టీలకు వంత పాడ‌తార‌ని, వాటిని స‌ర్వేల‌ని తాము అనుకోలేమ‌ని తీసిపారేశారు. ఎందుకంటే గ‌తంలో సారు- కారు- ప‌ద‌హారు అన్న‌ది వీరేన‌ని.. ఆ త‌ర్వాత ఆ సంఖ్య ఎంత పెద్ద ఎత్తున త‌గ్గిందో తెలిసిందేననీ గుర్తు చేశారు.  ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలూ జూబ్లీ బైపోల్ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదంటున్నారు పరిశీలకులు. దీంతో  ఇక్క‌డి ఓట్ల కొనుగోలు ప్ర‌క్రియ మొదలైపోయిందంటున్నారు.   ఓటుకు రెండు వేలు, మూడు వేలు అంతకన్నా ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు.  పోలింగ్ తేదీనాటికి ఓటు ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోవడం లేదంటున్నారు. ఎందుకంటే జూబ్లీ బైపోల్ మూడు పార్టీలకూ అత్యంత ప్రతిష్ఠత్మకం కనుక అంటున్నారు. 

జూబ్లీ బైపోల్.. గెలుపోటములతో పాటు.. పోలింగ్ శాతంపైనా చర్చ!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. విమర్శల ఘాటు తీవ్రమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో జూబ్లీపైపోల్ లో ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న చర్చ జోరందుకుంది. అయితే దీనిని మించి అసలు జూబ్లీలో పోలింగ్ శాతం ఎంత నమోదౌతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. తప్పకుండా డిబేట్ జరిగే పాయింట్ ఇది. తక్కువ పోలింగ్ శాతం.. ఇక్కడి ఎన్నికని ప్రభావితం చేసే మేజర్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. పోలింగ్ భారీగా నమోదవుతుందా? లేక.. ఎప్పటిలాగే 50 శాతం లోపే ఉంటుందా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.  ఒకవేళ.. తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఎవరికి నష్టం జరుగుతుంది? ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఏ పార్టీకి ప్లస్ అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. దానివల్లే, ఈ ఉపఎన్నికలోనైనా జూబ్లీహిల్స్ ఓటర్లు గడప దాటి, పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. మెజారిటీ ఓటర్లు.. ఎప్పటిలాగే.. ఎవరైతే ఏముంది? మాకొచ్చేదా? పోయేదా? అని లైట్ తీసుకొని.. రిలాక్స్ అవుతారా? అన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఒక్కసారి జూబ్లీహిల్స్ పోలింగ్ హిస్టరీని చూస్తే.. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి జూబ్లీలో పోలింగ్ ట్రెండ్ ను ఓ సారి పరిశీలిస్తే.. 2014లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే అత్యధికంగా నమోదైన పోలింగ్ రికార్డ్. అంటే అంతకు ముందు ఇక్కడ భారీ పోలింగ్ జరిగిందని కాదు. మరీ గతంలోకి పోకుండా.. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి మాత్రమే మన పరిశీలనకు తీసుకుందాం. సరే 2014లో జూబ్లీ నియోజకవర్గంలో 50.1శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరిగిందని చెప్పుకున్నాం కదా.. 2018 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి 5 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. అప్పుడు కేవలం.. 45.5 శాతం  మాత్రమే పోలింగ్ నమోదైంది.  ఆ తరువాత  జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. మళ్లీ 5 శాతం పోలింగ్ పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన పోలింగ్ కేవలం 39.8 శాతం  మాత్రమే. గత గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇక్కడ పోలింగ్ 50శాతం దాటలేదు.  2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  జూబ్లీహిల్స్‌లో  47.5 శాతం ఓటింగ్  నమోదైంది. 2014 ఎన్నికల తర్వాత ఇదే హయ్యెస్ట్. అయితే.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నాటికి పోలింగ్ శాతం మళ్లీ రెండు శాతం తగ్గి  45.5 శాతం మాత్రమే నమోదైంది.  అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నడూ 50శాతం పోలింగ్ నమోదు కాలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ ఏరియాలున్నాయ్. ఓ వైపున సంపన్నులుంటే.. మరోవైపు సాధారణ ప్రజలు ఉంటారు. ఇక్కడ ఎన్నికలొస్తే.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు.. స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాలు కూడా ఎక్కువే ఉన్నాయ్. ఇక్కడి ఓటర్లే.. ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే.. తెలంగాణ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌కు తొలిసారి ఉప ఎన్నిక వచ్చింది. మరి.. ఈ బైపోల్ విషయంలోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? లేక.. ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఈ ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో.. పోలింగ్ శాతంపై కూడా అంతే డిబేట్ నడుస్తోంది. ఈ ఉపఎన్నికలో.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. గట్టిపోటీ ఉన్నప్పుడు, ఒక్క బైపోల్‌.. మొత్తం స్టేట్ రాజకీయాన్నే మార్చేస్తుందని నమ్ముతున్నప్పుడు.. తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని.. అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తాయ్. ఓటర్లను పోలింగ్ కేంద్రాల దాకా రప్పించేందుకు ఎంతో ప్రయత్నిస్తాయి. అందువల్ల.. జూబ్లీహిల్స్‌ బరిలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులంతా.. ఓటర్లని పోలింగ్ స్టేషన్ల దాకా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా.. మాస్ ఏరియాల్లో బీసీ, ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను.. పోలింగ్‌కు రప్పించడానికి పార్టీలు మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది. క్లాస్ ఏరియాల్లో నివసించే వారు.. పోలింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు.. పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఇప్పటికే పర్సనల్ అప్పీల్స్ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి.. వారు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ.. వాళ్లంతా పోలింగ్ కేంద్రాల దాకా వస్తారా? లేదా? అనేదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో నమోదైన మొత్తం ఓటర్లలో.. దాదాపు 22 శాతం మంది 29 ఏళ్ల లోపు యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా.. ఉద్యోగాలు, విద్య, మౌళిక వసతుల లాంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీరి టర్నౌట్ గనక పెరిగితే.. పోలింగ్ శాతం తప్పకుండా పెరుగుతుందనే అంచనాలున్నాయ్. గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే.. ఇక్క 50 శాతం పోలింగ్ టచ్ కావడం కాస్త కష్టమే అయినప్పటికీ.. పార్టీల మధ్య నెలకొన్న బలమైన పోటీ, యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, పార్టీల నేతలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు రప్పించడంలో చూపించే శ్రద్ధ మీదే ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరగడమా? తగ్గడమా? ఎప్పటిలాగే నమోదవడమా? అనేది ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.

జ‌గ‌న్ + భ‌జ‌న‌ - పార్టీ = ?

జ‌గ‌న్ ప్ల‌స్ భ‌జ‌న మైన‌స్ పార్టీ.. ఇదీ నెల్లూరు మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ సారాంశం. జ‌గ‌న్ చుట్టూ భ‌జ‌న  ప‌రులు పేరుకుపోయార‌నీ, ఆయ‌న వారి చెప్పుడు మాట‌లు విని నిండా మునిగిపోయార‌నీ, అప్పుడ‌ప్పుడూ ఆయ‌న్ను విమ‌ర్శించి, త‌ప్పు స‌రిదిద్దే వారి మాట‌లు కూడా వినాల‌ని హిత‌వు ప‌లికారు మేక‌పాటి. నిజానికి జ‌గ‌న్ లో అలాంటి మార్పు వ‌చ్చే అవ‌కాశ‌ముందా? అని చూస్తే అందుకు ఆస్కార‌మే లేద‌ని అంటారు ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు. జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోటరీలో కీ ప‌ర్స‌న్ అయిన విజ‌య‌సాయి రెడ్డి ఈ బాధ ప‌డ‌లేక ఆయ‌న్ను విడిచి వెళ్లిపోయారు.   పార్టీకి దూరంగా మ‌స‌లుతున్నారు. ఇక మిగిలింది స‌జ్జ‌ల‌, ధ‌నుంజ‌య‌రెడ్డి త‌దిత‌రులు. జ‌గ‌న్ ది బాగా ఇగో ఉన్న కేరెక్ట‌రైజేష‌న్. ఆయ‌న త‌న‌కు ఏది అనిపిస్తే అది చేయ‌డం ఒక అల‌వాటు. ఊరికే  వచ్చి ఇచ్చే ఉచిత స‌ల‌హాలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టించుకోరు. అది ఆయ‌న ఇగోయిస్టిక్ మైండ్ సెట్ కి సంబంధించిన విష‌యం. ఒక వేళ ఎవ‌రి నుంచైనా స‌ల‌హా తీసుకుంటే.. కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి పీకే వంటి వారిని నియ‌మించుకుని వారి నుంచైనా ఏదైనా స‌ల‌హా సూచ‌న పాటిస్తారేమోగానీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌న క‌న్నా కింది స్థాయి వ్య‌క్తుల మాట‌లు విన‌డం గానీ వారికి  ప్ర‌యారిటీ ఇవ్వ‌డం గానీ ఉండ‌దు. జ‌గ‌న్ ది అంతా వ‌న్ వే.  త‌న పార్టీలో ఉన్న లీడ‌ర్ల‌ను జ‌గ‌న్ కేవ‌లం పావులుగానే భావిస్తారు. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెడితే వారక్క‌డి నుంచి  గెలుస్తారంటే  అదంతా త‌న చ‌రిష్మా యేననీ, వారికంటూ సొంత  ప్ర‌తిభా పాట‌వాలుండ‌వనే నమ్ముతారు జగన్. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఒక రాజ‌కీయ చ‌ద‌రంగం ఆడి బొక్క‌బోర్లా ప‌డ్డారు.   జ‌గ‌న్ కి ఒక మ‌నిషికి విలువ ఇవ్వాల‌న్న విషయం కనీసం తెలియదంటారు ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు.  ఇదే విషయాన్ని  విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టికే ఎన్నోసార్లు బాహ‌టంగానే చెప్పారు కూడా.  జ‌గ‌న్ తో పోలిస్తే తానెంతో సీనియ‌ర్ అయినా.. నిల‌బ‌డే మాట్లాడాల్సి ఉంటుంద‌ని విజయసాయిరెడ్డి చెప్పుకోవడమూ  తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను కూడా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ గౌర‌వించిన దాఖలాలు లేవు. ఈ విష‌యంలో ర‌ఘురామ మ‌రింత క్లారిటీగా చెప్ప‌గ‌ల‌రు. ఆయ‌నంతగా జ‌గ‌న్ ని వ్య‌తిరేకించారంటే అందుకు కార‌ణం ఈ విలువ‌లేని త‌న‌మే. సాధార‌ణంగా చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్కరికీ వారి వారి  స్తోమ‌త‌కు త‌గ్గ‌ట్టు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. కొన్ని సార్లు ఆ విష‌య ప‌రిజ్ఞానం ఎన్నో వింత‌లను న‌మోదు చేస్తుంద‌ని న‌మ్మే ర‌కం కాదు జ‌గ‌న్ రెడ్డి. ఆయ‌నదంతా త‌న తాత స్టైల్. వీడ్ని కొట్టు- వాడ్ని ప‌ట్టు- ఇదిగో వీడికి పెట్టు. అనుకుంటారు త‌ప్ప‌.. మ‌న‌క‌న్నా మించి మ‌న‌కు తెలివితేట‌లు నేర్పేవారు మ‌న కింది స్థాయి  వ్య‌క్తుల్లో ఉంటార‌న్న న‌మ్మ‌కాలు గానీ, అభిప్రాయాలు గానీ జ‌గ‌న్ లో ఉండ‌వు. ఉండ‌బోవు.  ఆయ‌న‌దంతా ఒక‌టే సిద్ధాంతం. పైన దేవుడున్నాడు. కింద  జ‌నం ఉన్నారు. మ‌ధ్య‌లో మ‌నం  ఈ ఇద్ద‌రి ద్వారా ఇక్క‌డ చ‌క్రం తిప్పుతుంటాం అనుకునే బాప‌తు. ఒక వేళ మేక‌పాటి చెప్పిన‌ట్టు ఎవ‌రైనా ఒక‌రు చెప్పిన స‌ల‌హా సూచ‌న‌ల కార‌ణంగా ఏదైనా పార్టీకి ల‌బ్ధి చేకూరిందే అనుకుంటే.. జ‌గ‌న్ లోని ఇగో దాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు.  జ‌గ‌న్ ఫీలింగ్స్ లో ఇది జ‌నం  కోసం పార్టీ పెట్టిన  పార్టీ అని గానీ వారికి ల‌బ్ధి చేకూరాల‌ని పెట్టిన పార్టీ అనిగానీ భావించరు. త‌న తండ్రి మీద‌నే ఒక ఈర్ష్య, అసూయ క‌లిగిన  వ్య‌క్తి జ‌గ‌న్. ఈ విష‌యం  ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. తాను ఓదార్పు యాత్ర‌ల‌కు వెళ్లిన‌పుడు త‌న తండ్రి  ఫోటో వారిళ్ల‌లో దేవుడి ఫోటోల ప‌క్క‌న  పెట్టార‌నీ.. ఆ స్థానంలో త‌న ఫోటో ఉండాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌గాఢ‌మైన‌ కోరిక‌.  అందుకోసం తాను అధికారంలో ఉండగా ఎడా పెడా, ఇబ్బ‌డి ముబ్బ‌డిగా జ‌నానికి రాష్ట్ర ఖ‌జానా  సొమ్ము దోచి పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడలేదు జగన్.  అదే సొమ్ము రాష్ట్రం చెంత ఉంటే, దాంతో ఈ పాటికి అమ‌రావ‌తి రాజ‌ధానితో పాటు పోల‌వ‌రం కూడా పూర్త‌య్యి ఉండేది.  అలాంటి జగన్ ఇప్పుడు  కార్య‌క‌ర్త‌ల కోసం తాను మారుతున్న‌ట్టు చెబుతున్నా.. జ‌గ‌న్ కున్న మాన‌సిక స్థితిని బ‌ట్టి చూస్తే అందులోనూ వ‌న్ వే యేఉంటుంది త‌ప్ప‌, ప్ర‌జాస్వామిక విధాన  స‌ర‌ళిని  ఊహించ‌డం వెర్రిత‌న‌మే అవుతుందంటున్నారు పరిశీలకులు.  అటువంటి జగన్ కనుక రాష్ట్రానికి మరో సారి సీఎం అయితే.. ఏపీని ఆయ‌న నామ‌రూపాల్లేకుండా చేస్తార‌న‌డంలో సందేహానికి తావులేదం టున్నారు విశ్లేషకులు.

ఉచిత బ‌స్సు ఎఫెక్ట్ న్యూయార్క్ ను కూడా షేక్ చేసిందిగా!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద వ్య‌తిరేక‌త ఈనాటిది కాదు. ఆయ‌న తొలిసారి గెలిచిన‌పుడు కూడా తీవ్ర జ‌నాగ్ర‌హం వ్య‌క్త‌మైంది.  రాస్తారోకోలు, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, కోర్టు కేసులు  న‌డిచాయ్. ఆయ‌న రెండో సారి ఓడినా, మ‌ళ్లీ తీవ్ర య‌త్నాలు సాగించి మరోసారి అగ్రదేశాధ్యక్షుడయ్యారు. ఎట్ట‌కేల‌కు త‌న సెకండ్ ట‌ర్మ్ డ్రీమ్ నెర‌వేర్చుకున్నారు.  అమెరికా అధ్యక్షపగ్గాలను రెండో సారి చేపట్టీపట్టడంతోనే ఆయన తీసుకున్న తీవ్ర నిర్ణ‌యాల కారణంగా చిక్కుల్లో పడ్డారు. పడుతున్నారు. ఇప్ప‌టికే ట్రంప్ మీద ఎన్నో కేసులున్నాయి. తాజాగా  ఆయ‌న మీద ఎంత వ్య‌తిరేకత ఉందో చెప్ప‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ న్యూయార్క్ మేయ‌ర్ ఎన్నిక‌. ఈ ఎన్నిక అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాకిచ్చింది. న్యూయార్క్ మేయ‌ర్ గా భార‌త ఉగండా మూలాలున్న జోహ్రాన్ మ‌మ్ దానీ ఎన్నిక‌య్యారు. ఈయ‌న మ‌రెవ‌రో కాదు మ‌న భార‌తీయ ద‌ర్శ‌కురాలు మీరానాయ‌ర్- ఉగాండాకి చెందిన మమ్ దానీల‌ కుమారుడే. మ‌మ్ దాని ఓట‌మి కోసం ట్రంప్ ఎంత రిస్క్ చేశారంటే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం అధికంగా ఉన్న మ‌మ్ దానీని    గెలిపిస్తే న్యూయార్క్ కోసం చాలా చాలా త‌క్కువ నిధులు మాత్ర‌మే మంజూరు చేస్తానని అక్కడి ఓట‌ర్ల‌ను హెచ్చ‌రించారు.  అయితే ట్రంప్ హెచ్చరికలను న్యూయార్క్ జనం ఖాతరు చేయలేదు. అత్యంత పిన్న వ‌య‌స్కుడైన 34 ఏళ్ల మ‌మ్ దానీని మేయర్ గా ఎన్నుకున్నారు.   మాజీ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యోమోపై విజ‌యం సాధించి యంగ‌స్ట్ మేయ‌ర్ ఫ‌ర్- ఓల్డెస్ట్ సిటీగా మ‌మ్ దానీ రికార్డు సృష్టించారు.   ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ మ‌రో విష‌య‌మేంటంటే.. మ‌మ్ దానీ ద‌క్షిణ భార‌త‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేస్తోన్న‌ ఉచిత సిటీ  బ‌స్సు ప్ర‌యాణాల ప్ర‌క‌ట‌న చేయ‌డం బాగా క‌ల‌సి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. కేవ‌లం బెంగ‌ళూరు, హైద‌రాబాద్ లోనే కాదు న్యూయార్క్ లోనూ ఈ  ఫ్రీబ‌స్ ట్రిక్ ప‌ని చేసిందంటే దీని రేంజ్ ఏంటో ఊహించుకోవ‌చ్చు. ఫ్రీబ‌స్ ఆఫర్ కి అంత‌ర్జాతీయంగానూ జనం బుట్ట‌లో ప‌డిపోతున్నార‌న్న‌మాట‌.  స‌ర్కార్ కి  ఇదెంత న‌ష్ట‌దాయ‌క‌మైనా కూడా ఇలా జ‌నం లెక్క చేయ‌కుండా ఉచిత  ప్ర‌యాణాల మోజులో ప‌డ్డ‌మేంట‌న్న‌ది పెద్ద చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని మాటివ్వ‌డం, యూనివర్శల్‌ ఛైల్డ్‌ స్కీమ్‌ అమలు చేస్తాన‌న‌డం, 2030 నాటికి కనీస వేతనాల పెంపు గ్యారంటీగా చెప్ప‌డం, కార్పొరేట్లు, సంపన్నులపై పన్ను పెంచి చిరుజీవుల జీవన వ్యయాలను తగ్గిస్తానని త‌న‌ ప్రచారంలో చెప్పుకొచ్చారు జోహ్రాన్ మ‌మ్ దానీ. ఇవి కూడా నగర ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. వీటిన్నింటికీ మించి అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్య‌తిరేకంగా ఎంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటంలోనూ విజ‌యం సాధించారు జోహ్రాన్ మ‌మ్ దానీ. ఏది ఏమైనా లాస్ట్ పంచ్ ఏంటంటే ఇక్క‌డా ఫ్రీ బ‌స్ స్కీమ్ వ‌ర్క‌వుట్ కావ‌డం.

ప్రతిపక్ష హోదా కోసం జగన్ వృధా ప్రయాస

ప్రజలు ఇవ్వకపోయినా విపక్ష హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టుపట్టి ప్రజల దృష్టిలో మరింత చులకల అవుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఆయన చేస్తున్నదంతా వృధాప్రయాసేనని తెలియదా? వైసీపీ లో అంతో కొంతా విషయజ్ణానం ఉన్న వారు ఎవరూ ఈ సంగతిని ఆయనకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారనీ, ఏం చేసినా ఆయనకు విపక్ష నేత హోదా కానీ, ఆయన పార్టీకి విపక్ష పార్టీ హోదా కానీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవనీ పరిశీలకులు అంటున్నారు. అయితే తాజాగా జగన్ కు అత్యంత బలమైన మద్దతు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ పడుతున్న తాపత్రేయం అనవసరమని అన్నారు. ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చు అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని కుండబద్దలు కొట్టేశారు.  రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదని ఉండవల్లి విస్పష్టంగా చెప్పారు.  అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి  ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని ఉండవల్లి అన్నారు. ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు.  తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా.. ఉండవల్లి చెబుతున్నదాన్ని బట్టి చూస్తే సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందనీ, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్నది ఉండవల్లి అభిప్రాయంగా కనబడుతోంది. అధికార తెలుగుదేశం కూటమి కూడా జగన్ కేవలం అహంభావంతో మాత్రమే అసెంబ్లీని బాయ్ కాట్ చేశారని విమర్శిస్తున్నారు.  జగన్ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తమ పార్టీకి ఉన్న 151 మంది సభ్యుల బలం చూసుకునిసభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అందరినీ అవమానించిన జగన్ ఇప్పుడు తనకు అదే మర్యాద జరుగుతుందన్న భయంతోనే ప్రతిపక్ష హోదా నెపంతో సభకు గైర్హాజరు అవుతున్నారని అధికార పార్టీ అంటున్నది. ఇప్పడుు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా  అధికారపార్టీ అంటున్నదే రైట్ అన్నారని భావించాల్సి వస్తున్నది.   ప్రతిపక్ష హోదా  ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం విడ్డూరంగా ఉందంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.  అధికార పక్ష సభ్యుల తీరు నచ్చకుంటే  సభ నుంచి వాకౌట్ చేయడం వంటివి సాధారణమని, కానీ మొత్తంగా సభకే గైర్హాజరు కావడం అనుచితమని, ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదనీ అన్నారు. మరి ఇప్పటికైనా జగన్ కు జ్ణానోదయం అవుతుందా చూడాల్సిందే!

రాజగోపాల్ రెడ్డి కింకర్త్యం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. దబాయించి, బెదరించి పార్టీలో పదవులను తెచ్చుకోవడం అంత తేలిక కాదని క్లియర్ కట్ గా కాంగ్రెస్ హై కమాండ్ తన చేతల ద్వారా చూపింది. రేవంత్ కేబినెట్ లో బెర్త్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని అస్త్రాలూ ఉపయోగించేశారు. సామ, దాన, బేద, దండోపాయలను వాడేశారు. అయినా పార్టీ హైకమాండ్ కిమ్మనలేదు. చర్యలు తీసుకోలేదు. అలాగని మంత్రి పదవి గ్యారంటీ అన్న హామీను ఇవ్వలేదు. సరికదా... కోమటిరెడ్డికి నేరుగా చెప్పకుండానే కేబినెట్ బెర్త్ ఇచ్చేది లేదన్న విషయాన్ని చేతల ద్వారా చెప్పకనే చెప్పింది.   త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని.. ఇస్తార‌ని.. అయితే ఇందుకు కొందరు అడ్డుపడుతున్నారనీ ఇంత కాలం చెబుతూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి..  కాంగ్రెస్ అధిష్ఠానంపై కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి గతంలో పార్టీ హైకమాండ్ పదవులు ఇచ్చిన సందర్భాలను ఉటంకిస్తూ, తనకిస్తే తప్పేమిటని కూడా నిలదీశారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలూ, విమర్శలూ చేసేశారు.  ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌చ్చిన వారిని అందలం ఎక్కించారని నిష్ఠూరాలాడారు.   గీత దాటి విమర్శలు చేసినా  కనీసం  క్రమశిక్షణా కమిటీ ముందుకు కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని పిలవలేదు. ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయన వ్యాఖ్యలు, విమర్శలను పార్టీ  హైకమాండ్ అసలు పట్టించుకోనట్లుగానే వదిలేసింది. కీలెరిగి వాత పెట్టిన సందర్భంగా.. ఆయనకు వాస్తవం కళ్లకు కట్టేలా చేసింది. తాజాగా  రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోని మహమ్మద్ అజారుద్దీన్ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా.. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ నాయకులు ప్రేమ్‌సాగ‌ర్‌రావు, సుద‌ర్శ‌న్‌రెడ్డికి  కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవులు ఇచ్చారు.   కానీ తనకు మంత్రి పదవి కావాలి, ఇచ్చి తీరాలి అంటూ ఎన్నో ఆశలు పెట్టుకోవడమే కాకుండా, పదవి కోసం నానా యాగీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా విస్మరించారు.  హైకమాండ్ ఈ విషయంలో స్పష్టతతో ఉంది కనుకనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా విస్మరించిన అంశం ఇప్పుడు కాంగ్రెస్ లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని ఏ వర్గం నుంచీ కూడా రాజగోపాల్ రెడ్డి పట్ల సానుభూతి వ్యక్తం అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.  పదవి కోసం హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో వ్యవహరిస్తే.. ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న ఆసక్తి మాత్రం రాజకీయవర్గాలలో కనిపిస్తోంది.