ఆప్ ఎమ్మెల్యే పై కాల్పులు.. కాల్పుల్లో మృతి చేందిన ఆప్ కార్యకర్త
posted on Feb 12, 2020 @ 10:18AM
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో ఆప్ ఘన విజయాన్ని ఎగురవేసింది. ఎన్నికల్లో గెలిచి ఘన విజయాన్ని జరుపుకుంటున్న నేపధ్యంలో ఆప్ ఎమ్మెల్యే పై కాల్పులు జరిగాయి.ఢిల్లిలో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్ పై కాల్పులు కలకలం రేపాయి. ఎన్నికల్లో గెలిచి విజయోత్సాహంలో ఉన్న నరేష్ యాదవ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆశోక్ కుమార్ అనే ఆప్ కార్యకర్త మృతి చెందగా మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. తన కాన్వాయ్ పై కాల్పులకు దిగిన ఆగంతకులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించడం ద్వారా ఆగంతకులను పోలీసులు గుర్తించవచ్చన్నారు.పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యప్తును కొనసాగిస్తున్నారు.