సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు అదే కారణమా? పర్యటనకు సర్వం సిద్ధం
posted on Feb 12, 2020 @ 10:12AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లి పర్యటణ చేయనున్నారు. ఈ రోజ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపైనే ప్రధానితో చర్చించే అవకాశం ఉండగా ఈ సారి జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఆమోదం పొందేందుకు చొరవ తీసుకోవాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.ఈ అంశంతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధులు పైనే ప్రధాని దృష్టికి సిఎం తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయనున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు మరి కొంత మంది కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం. నేడు జరిగే రాష్ట్ర క్యాబినేట్ భేటీ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఢిల్లికి వెళ్లనున్నట్లు సమాచారం.
బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనున్న నేపధ్యంలో సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లి ప్రయాణానికి సిద్ధం అవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లి పర్యటనలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసి రాష్ట్రానికి సంబంధించి వాయిదాలో ఉన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువస్తారని అధికార వర్గాల సమాచారం. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ లకు తగిన కేటాయింపులు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళటమే కాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాల పై మరోసారి ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం రాత్రి ఏడు గంటలకు సిఎం వైఎస్ జగన్ ఢిల్లి నుంచి తిరుగు ప్రయాణమవ్వనున్నారు. మొత్తానికి మన ఏపీ సీఎం జగన్ ఢిల్లి పర్యటణతో కీలక విషయాలకు తెర పడనుందో లేదో వేచి చూడాలి.