దిశ యాక్ట్ కింద తొలి విజయం... ఆకతాయికి క్షణాల్లో సంకెళ్లు...

అమ్మాయిలకు రక్షణగా తీసుకొచ్చిన ఏపీ దిశ చట్టం... తొలి విజయాన్ని నమోదు చేసింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరిని నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ ద్వారా బాధితురాలికి వేగంగా ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశ అత్యాచార, హత్య ఘటన తర్వాత..మహిళల భద్రతే లక్ష్యంగా ఏపీ సర్కార్ దిశ చట్టం పేరుతో కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల రాజమండ్రిలో ఏపీ సీఎం జగన్ దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సందర్భంగా దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు. 

మహిళల భద్రతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ దిశ యాప్ లో తొలి సక్సెస్ స్టోరీ నమోదైంది. విశాఖ నుంచి విజయవాడ వస్తున్న బస్సులో ఆకతాయి వేధింపులకు దిగడంతో ....బాధితురాలు దిశా టీంకు సమాచారం ఇచ్చింది. తెల్లవారుజామున 4గంటల 21నిమిషాల సమయంలో... బాధిత మహిళ SOS అనే యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే, దిశ యాప్ కు వచ్చిన మొదటి కేసును నిమిషాల వ్యవధిలోనే చేధించారు. వెంటనే స్పందించిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు వేధింపులకు పాల్పడ్డ ఆకతాయిని అరెస్ట్ చేశారు.

చిమ్మ చీకట్లలో ప్రయాణిస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దిశ యాప్ ద్వారా మహిళకు అండగా నిలిచిన ఈ కేసును స్పందన రివ్యూలో డీజీపీ గౌతం సవాంగ్.... సీఎం జగన్ కు వివరించారు. ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఇంత త్వరగా స్పందించి ఆకతాయిని అరెస్ట్ చేసిన పోలీసులను.. సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. దిశ యాక్ట్ ఉద్దేశ్యాన్ని, ఫలితాన్ని చూపించినందుకు అభినందించారు.

Teluguone gnews banner