దొంగలకూ సెంటిమెంట్లుంటాయ్....
posted on Oct 12, 2012 @ 5:59PM
ప్రకాశ్ సాహు పేరు చెప్పగానే ఏగుడి తలుపులైనా గడగడలాడాల్సిందే. ఈ చోరశిఖామణి ఆలయాల్లో చోరీలు చేయటంలో ఆరితేరిన వాడు. విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో దొంగతనం చేసినప్పుడు బయట పడింది ఇతని పేరు. ఆతరువాత చాలా గుళ్లలో దొంగతనాల్లో పాలు పంచుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. చత్తీస్ ఘడ్ కి చెందిన ఇతగాడికి అమ్మవారి నగలంటే చాలా ఇష్టమట. అంతేకాదు సదరు సాహు అమ్మవారికి దణ్ణం పెట్టుకోందే దొంగతనం చేయడంట. ప్రస్తుతానికి ఇతని ఖాతాలో తూర్పు గోదావరి జిల్లాలో దేవాలయాల్లో జరిగిన దొంగతనాలతోపాటు, కెపిహెచ్ బిలో, జూబ్లిహిల్స్ లో జరిగిన నగల దుకాణాల చోరీలు కూడా సాహు పనేనని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ మధ్య జరిగిన లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి నగల్నికూడా సాహూయే కొట్టాశాడన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమౌతున్నాయి. పోలీసులు సాహూని అదుపులోకి తీసుకుని నిజం రాబాట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు.