అమెరికాలో దొరకని చిన్నారి శాన్వీ ఆచూకీ!

 

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రకాశం జిల్లాకి చెందిన ఓ మహిళను దారుణంగా చంపేశారు. ఆమె చేతిలో ఉన్న పసిపాపాయి శాన్విని ఎత్తుకుపోయారు. ఎవరు చేశారో తెలీదు. ఎందుకు చేశారో తెలీదు. శాన్వి తండ్రికి మాత్రం గుండె తరుక్కుపోతోంది. ఓ వైపు తల్లిని దారుణంగా చంపేశారు. మరోవైపు ప్రాణానికి ప్రాణమైన పదినెలల చిన్నతల్లిని ఎత్తుకుపోయారు. అప్పర్ మేరియన్ టౌన్ షిప్ లో ఉంటున్న ఈ కుటుంబం చాలాకాలంగా అక్కడ్నుంచి వెళ్లిపోవాలనుకుంటూనే తాత్సారం చేసింది. నిర్ణయం తీసుకునేలోగానే ఘోరం జరిగిపోయింది. అక్టోబర్ 22వ తేదీన ఇంట్లోకి చొరబడి నాయనమ్మని కాల్చేపారేసి చిన్నారి పాపని ఎత్తుకెళ్లారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోపు హత్య జరిగిఉంటుందని ప్రాథమిక ఆధారాల్నిబట్టి అనుమానిస్తున్నారు. తన బిడ్డని తనకు క్షేమంగా అప్పగిస్తే మొత్తం ఆస్తి రాసియ్యమన్నా రాసిచ్చేస్తానంటూ పాపాయి తండ్రి శివ వెన్నా కిడ్నాపర్లను ప్రాధేయపడుతున్నారు. ఇప్పటివరకూ పాప ఆచూకీ తెలియక పోవడంతో శాన్వి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. దుండగుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న సత్యవతి మృతికి తానా సంతాపం తెలిపింది. హత్య, కిడ్నాప్ మిస్టరీల్ని ఛేదించేందుకు గట్టిగా ప్రయత్నించాలని కోరుతూ అమెరికాలోని భారత రాయబారికి లేఖ రాసింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.