మోడల్ బిదుషిని దారుణంగా హత్య చేశారా?

 

ముంబైలో మోడల్ బిదుషి మరణం కలకలం రేపింది. ఆమె భర్త ఇంటికొచ్చి చూసేసరికి బిదుషి నెత్తుడి మడుగులో పడుతుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభంలేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఒడిషాకి చెందిన బిదుషి చెన్నైలోమోడల్ గా పనిచేస్తూ అవకాశమొచ్చినప్పుడల్లా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రల్నికూడా పోషించేది. దక్షిణాదిలో కొన్ని సినిమాల్లో తరచూ కనిపించిందికూడా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఖేదర్ తో ప్రేమాయణం బిదుషి జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. మూడేళ్లక్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ముంబైలో కాపురం పెట్టింది. పరిసరాలను, ప్రాథమిక ఆధారాల్ని బట్టి బిదుషి షుగర్ వ్యాధి కారణంగా ప్రమాదవశాత్తూ చనిపోయిందని మొదట కేసు నమోదుచేశారు. ఆమె ఒంటిపై గాయాలున్న విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలడంతో దాన్ని మర్డర్ కేసుగా మార్చారు. బిదుషి చనిపోయిన రోజున ఆమె సెల్ ఫోన్ కి 100 మిస్డ్ కాల్స్, 200 ఎస్మెమ్మెస్ లు వచ్చాయ్. గుర్తు తెలియని వ్యక్తులు బిదుషిని రేప్ చేసి చంపేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. అపార్ట్ మెంట్ సీసీ టీవీ ఫుట్టేజ్ ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.