Read more!

హైకోర్టు ఆదేశంపై ఆర్టీసీ సంఘాలు నిరసన

 

గత 8రోజులుగా ఉదృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ రోజుతో 9వ రోజుకు చేరుకొంది. ఈరోజు ఉదయం 10 గంటలలోపుగా సమ్మె విరమించాలని, ఆ సంగతి తనకు తెలియజేయాలని హైకోర్టు ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించింది. తమ కార్మిక చట్ట సమ్మతమయినదేనని, తమ హక్కుల కోసం సమ్మె చేసే హక్కు తమకు ఉందని, చట్ట ప్రకారం ప్రభుత్వాలకి నెల రోజులు ముందుగానే సమ్మె నోటీసులు అందజేసిన తరువాతనే, ప్రభుత్వాలు తమ డిమాండ్లను పట్టించుకోక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తోందని ఆర్టీసీ కార్మిక సంఘాల వాదన. అందుకే వారు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా రెండు రాష్ట్రాలలో అన్ని బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయబోతున్నారు. హైదరాబాద్ లో గల ‘బస్ భవన్’ ను ఈరోజు ముట్టడించడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి. ఈరోజు హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని, ఒకవేళ హైకోర్టు తమ సమ్మె కొనసాగానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే సుప్రీంకోర్టులో అప్పులు చేసుకొనయినా సరే తమ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు చెపుతున్నారు. ప్రభుత్వాలు న్యాయబద్దమయిన తమ డిమాండ్లకు అంగీకరించేవరకు సమ్మెను నిలిపేది లేదని వారు తేల్చి చెపుతున్నారు.