కలెక్టర్ కాదు కేసీఆర్ బంట్రోతు.. వెంకట్రామిరెడ్డి అవినీతి బయటపెట్టిన రేవంత్రెడ్డి..
posted on Nov 16, 2021 @ 5:08PM
వెంకట్రామిరెడ్డి మాజీ కలెక్టర్ కాదు.. టీఆర్ఎస్ బంట్రోతు. కేసీఆర్ భూ అక్రమాలకు సహకరించినందుకే ఆయనను ఎమ్మెల్సీకి ఎంపిక చేశారంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్కు వెంకట్రామిరెడ్డి బంట్రోతుగా పని చేశారు. ప్రాజెక్టుల భూ సేకరణలో నిర్వాసితులను బెదిరించారు. కోకాపేట భూ గోల్మాల్లోనూ వెంకట్రామిరెడ్డి హస్తం ఉంది. 2017లో ఆయన దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారిగా ఉన్నప్పుడు 5 వేల ఎకరాలు ఎవరికి బదిలీ చేశారు? ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పిన ఘనుడు. ఇలా అనేక అవినీతి ఆరోపణలు ఉన్న వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు. అందరి ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా కేసీఆర్ నియమించారని అన్నారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు రేవంత్రెడ్డి. అంతటి అవినీతి పరుడైన వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి అనర్హుడని పీసీసీ చీఫ్ తేల్చి చెప్పారు.