ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది! ఆర్బీఐ
posted on Apr 10, 2020 @ 1:03PM
కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన పరిస్థితులు మళ్లీ చక్కబడితే దేశీయ డిమాండ్, వృద్ధి పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వృద్ధి రేటును అంచనా వేయడం కష్టమని తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తికి ముందు మన దేశంలో 2020-21 వృద్ధిరేటు కొంత గాడిలో పడవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అభిప్రాయపడింది. అయితే 2019-20లో రబీ సీజన్ కలిసి రావడం, అధిక ఆహారం ధరలు గ్రామీణ డిమాండ్ పెంచాయని, కీలక రేట్ల కోత వల్ల బ్యాంకు రుణ రేట్లు తగ్గాయని ఆర్బీఐ వివరించింది. రబీ అధిగ దిగుబడులు గ్రామీణుల కొనుగోళ్ల శక్తిని పెంచుతుందని తెలిపింది. మౌలిక రంగ వ్యయాలు పెంచడం, పన్ను రేట్ల కోత వంటి నిర్ణయాలు మన దేశంలో డిమాండ్ పెంచుతాయని తెలిపింది. కరోనా వ్యాప్తితో మొత్తం అంచనాలు తలకిందులవుతున్నాయని వెల్లడించింది.
దేశీయ లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్యపరమైన నిర్ణయాలకు కేంద్రం ఆర్థికపరమైన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయనే విశ్వాసం వ్యక్తం చేసింది.
ఈ కష్టకాలంలో దేశ వృద్ధిరేటును అంచనా వేయలేమని చెప్పింది. ద్రవ్యోల్భణం 2.4 శాతం 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ నాటికి ద్రవ్యోల్భణం 2.4 శాతానికి పడిపోవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. జనవరిలో 7.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నాటికి 6.6 శాతంగా ఉందని పేర్కొంది.