Read more!

రాజీవ్ ఆరోగ్యశ్రీ కాదు... ఎన్టీఆర్ ఆరోగ్య సేవ

 

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పేరు మారింది. పేరు మారడంతోపాటు తీరు కూడా మారనుంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట వున్న పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మారుస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్య శ్రీలో 100 జబ్బులను అదనంగా చేరుస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్‌ ఛార్జీలను పెంచే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్‌, ట్రాకింగ్‌ విధానంపెడతామని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.