Read more!

ఢిల్లీ ఫైవ్‌స్టార్ హోటల్లో నర్స్ మీద గ్యాంగ్ రేప్

 

దేశ రాజధాని ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో గల ఓ గదిలో ఒక నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ దారుణం జరిగింది. అనారోగ్యంతో ఉన్న ఒక మహిళకు సపర్యలు చేయడానికి ఈ నర్సును నియమించారు. అయితే.. సదరు పేషెంట్‌కి సహాయకులుగా వచ్చిన నీరజ్, రాజన్ అనే ఇద్దరు యువకులు ఆ నర్సుపై అఘాయిత్యం చేశారు. అత్యాచారానికి గురైన నర్సు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. నిందితులు ఆమెపై మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఉద్యోగం పీకేస్తామని వాళ్లు బెదిరించి, ఒకరి తర్వాత ఒకరుగా పలుమార్లు అత్యాచారం చేసినట్లు అత్యాచారానికి గురైన నర్సు తన ఫిర్యాదులో పేర్కొంది.