ప్రియాంకని తనిఖీ చేయరట!
posted on Jun 8, 2014 @ 5:17PM
సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వధేరా దేశంలోని విమానాశ్రయాలకు వెళ్ళినప్పుడు తనిఖీ సిబ్బంది వారిని తనిఖీ చేయకుండానే విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించేవారు. ఆ సదుపాయం యు.పి.ఎ. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొనసాగనుంది. ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో సాధారణ తనిఖీల నుంచి మినహాయింపులు ఇకపైనా కొనసాగుతాయని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు తెలిపింది. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఈ మినహాయింపులు ఎత్తివేయనున్నారనే ప్రచారం సాగింది. దీనిపై ఎస్పీజీ విభాగానికి చెందిన అధికారులు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రియాంకాగాంధీ ఎస్పీజీ భద్రత కింద ఉన్నారు. దీంతో విమానాశ్రయాల్లో ప్రియాంకకు సాధారణ తనిఖీల నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఒక వేళ ఆమె వెంట భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలు వెళ్లినా ఇదే మినహాయింపులు వర్తిస్తాయి. ప్రాణాలకు ముప్పును బట్టే ఎవరికైనా భద్రత, మినహాయింపులు ఉంటాయి’’ అన్నారు.