రూ. 30 లక్షలకు పులి చర్మం అమ్ముతూ స్మగ్లర్లు.. పట్టుకున్న పోలీసులు..
posted on Jul 30, 2021 @ 12:03PM
అది తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం. అడవి దగ్గరిలో ఉన్న గ్రామాలూ గాఢ నిద్రలో ఉన్నపుడు.. అడవిలో రాత్రి పూట కొంతమంది పులుల వేట బయలు దేరుతున్నారు. గన్స్ ఉపయోగించి పులులను చంపుతారు.. ఆ తర్వాత వాటి అవయవాలను తీసుకుని.. వాటిని స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఏటూరు నాగారం దగ్గర పులిచర్మం అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు.. పులిచర్మం ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు మరి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 30 లక్షలకు పులి చర్మం అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మొత్తం దందాపై పోలీసులు కూపీగా లాగుతున్నారు. పూర్తి
పోలీసుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ఇరువురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు .వారి వద్దనుంచి పోలీసులు పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్ గడ్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని వాజేడుకు చెందిన తిరుమలేష్ సేకరించాడు. చత్తీస్గడ్కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఈక్రమంలో గోదావరి నది మీదుగా పులి చర్మాన్ని తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘనతో సంబంధమున్న మిగతవారిని పట్టుకుంటామని ఎస్పీ సంగ్రాంసింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్ ఆలం , ఐఎఫ్ఎస్ అధికారి శివ ఆశిష్ సింహం, స్పెషల్ ఆఫీసర్ ఏటూరునాగారం ప్రశాంత్ పాటిల్, ఏటూరునాగారం సీఐ కిరణ్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, శ్యాం ప్రసాద్ సిబ్బంది అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వాలు వన్య ప్రాణుల పరిరక్షణ కమిటీలు వేసి.. మూగ జంతువులకు రక్షణ కలిపిస్తుంటే డబ్బులు బానిసలూ అయినా కొంత మంది లాంటి సంఘవిద్రోహ చర్యలు చేస్తున్నారు. డబ్బులు కావాలంటే ఏదైనా పని చేసుకోవాలి గానీ ఎలా నోరులేని జీవాల మీద పడి వాటి ప్రాణాలు తీసి వాటితో వ్యాపారం చేస్తే ఎంతవరకు సమంజసం.. కొన్ని నెలల క్రితం వికారాబాద్ అడివిలో కూడా కొంత హైదరాబాద్ కి చెందిన కొంత మంది జింకలను వేటాడి వాటిని చంపి తింటున్నారని వార్తలు వచ్చాయి.. మళ్ళీ ఇప్పుడు ఏకంగా పులులు చంపి వ్యాపారం చేస్తున్నారు.