పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ మూకల దౌర్జన్యాలు
posted on May 13, 2024 @ 9:58AM
ఆంద్రప్రదేశ్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు, కిడ్నాపుల ఘటనలు జరిగాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేతలు అరాచకానికి దిగారు. తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకి లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లపై వైపీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇలాంటి ఘటనల మీద ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించాలని ఆదేశించింది. కడప జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్పై దాడి చేసి, పోలింగ్ స్టేషన్ నుంచి బయటకి లాగేశారు. అనంతపురం జిల్లా చాపాడు మండలంలోని ఒక పోలింగ్ కేంద్రానికి వైసీపీ నాయకులు మందలు మందలుగా వచ్చారు. వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంతో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. చిత్తూరు జిల్లాలో తమ పోలింగ్ ఏజెంట్లు ముగ్గురిని కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు చేసింది.