ఏబీవీకి జనం సంఘీభావం!
posted on May 31, 2024 @ 12:37PM
ఏబీ వెంకటేశ్వరరావు లాంటి నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారి అంటే జగన్ ప్రభుత్వం లాంటి అడ్డగోలు ప్రభుత్వానికి గౌరవం వుండకపోవచ్చు గానీ, ఆయనలోని నిజాయితీని, సామర్థ్యాన్ని, రాజీలేని పోరాటం చేసే తీరును చూసిన ప్రజలకు మాత్రం అపారమైన గౌరవం వుంది. ఏబీ వెంకటేశ్వరరావు యూనీఫామ్తోనే రిటైర్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకున్నారు. ఈ పిశాచ ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెడుతుంటే చూసి ఆగ్రహించారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడం పట్ల ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఐదేళ్ళపాటు వేధింపులకు గురైనప్పటికీ తాను కోరుకున్నట్టుగా ఈరోజు గౌరవప్రదంగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాలకుల అన్యాయాన్ని, అరాచకాన్ని ఎదిరించి వీరోచిత పోరాటం చేసి గెలిచిన ఏ బీ వెంకటేశ్వరరావుకు సంఘీభావం తెలపడానికి వేల సంఖ్యలో ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈరోజు, అంటే.. 31, మే శుక్రవారం నాడు విజయవాడలోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనరేట్ వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. అక్కడ ఏబీ వెంకటేశ్వరరావుని కలిసి అభినందనలు తెలపడానికి సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మన కోసం, తెగించి పోరాడే వాళ్ళ భుజం తట్టి ప్రోత్సాహించడం మన కనీస ధర్మం అని... ఏబీ వెంకటేశ్వరరావుని అభినందించడానికి బంధుమిత్ర సమేతంగా రండి అని ఆహ్వానిస్తున్నారు.