పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్సే : బాబు
posted on Oct 6, 2012 @ 3:07PM
టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చంద్రబాబు నాయుడు అన్నారు. పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. పేదలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. ఐదోరోజు బాబు పాదయాత్రలో వెంట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు 20 కి.మీ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు రాప్తాడు నియోజవర్గంలో పాదయాత్ర ప్రారంభించి అక్కడ నుంచి ఎంసీ పల్లి, తిమ్మాపురం, ఎస్సీ కాలనీ మీదుగా రెడ్డివారి పల్లి క్రాస్ చేరుతారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కొండాపురం, చిన్న కొండాపురం, నక్కెలవారి పల్లి, సజ్జయ్యవారి కొట్టాల మీదుగా పేరూరుకు చేరనున్నారు. పాదయాత్రలో పేదలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పేరూరులో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.