నిర్భయ దోషులకు డెడ్ లైన్... ఇక మిగిలింది ఒకే ఒక్కడు...

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్షమాభిక్ష అండ్ క్యురేటివ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ నిర్భయ దోషుల ఉరిపై జనవరి 31న పాటియాలా కోర్టు స్టే విధించడంతో నిలిచిపోయిన శిక్ష అమలు మళ్లీ ఎప్పుడనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే, పాటియాలా కోర్టు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం... అలాగే, ఢిల్లీ సర్కారు సవాలు చేయడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పు సంచలన తీర్పు వెలువరించింది. పాటియాలా కోర్టు తీర్పును సమర్ధిస్తూనే... న్యాయ ప్రక్రియను ముగించుకునేందుకు నిర్భయ దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే, దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. న్యాయ ప్రక్రియను ముగించి నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని చెప్పింది.

అయితే, న్యాయ ప్రక్రియ ముగించుకోవడానికి నిర్భయ దోషులకు వారం రోజులు గడువిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నలుగురు నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయడానికి ఆదేశాలు ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అలాగే, నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు వీల్లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంలో కేంద్రం సవాలు చేసింది.

ఇదిలాఉంటే, నిర్భయ దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దాంతో, నలుగురు నిర్భయ దోషుల్లో ఇఫ్పటికే ముగ్గురు మెర్సీ పిటిషన్లపై నిర్ణయం పూర్తయింది. ఇక, ఒకే ఒక్కడు మిగిలున్నాడు. అయితే, నిర్భయ దోషులకు ఢిల్లీ హైకోర్టు... వారం రోజుల గడువు ఇవ్వడంతో.... ఇక, మిగిలిన ఒకే ఒక్కడు పవన్ గుప్తా....ఈలోపే మెర్సీ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల గడువులోగా పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకుంటే రాష్ట్రపతి కూడా వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇఫ్పటికే ముగ్గురు దోషుల మెర్సీ పిటిషన్స్ ను రిజక్ట్ చేసి ఉండటంతో... ఒకవేళ పవన్ గుప్తా క్షమాభిక్ష కోరినా తిరస్కరించే అవకాశమే కనిపిస్తోంది.

Teluguone gnews banner