న్యాయం గెలిచింది... ఇంతియాజ్ కి ఉరిశిక్ష
posted on Feb 6, 2020 @ 3:43PM
నెల్లూరు ఎనిమిదవ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నెల్లూరు జిల్లా హరనాథపురం తల్లీకూతుళ్ళ హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 12 న మెడికో భార్గవి, తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. ఇద్దరు తల్లి కూతుర్లు దారుణమైన హత్యకు గురైన సమయంలో భార్గవి తండ్రి దయాకర్ రెడ్డి కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రి లో చికిత్స పొందుతూ బ్రతికాడు. ఈ కేసుకు సంబంధించి ఇంతియాజ్ అనే నిందితుడికి ఉరిశిక్షను అమలు చేసింది ధర్మాసనం.
భార్గవి వాళ్ళ కుటుంబం ఇళ్ళు కడుతుండగా దానికి సంబంధించిన ఇంటీరియర్ డెకరేషన్ కోసం పని చేయడానికి వచ్చిన ఇంతియాజ్ ఇంటిలో డబ్బు, నగలు ఎక్కువగా ఉన్నాయని గమనించాడు. వాటిని దొంగలిద్దామన్న నేపధ్యంలో వారి పై దాడికి ప్రయత్నించగా ఆ దాడిలో భార్గవి మరియు తన తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి మాత్రం తీవ్ర గాయల పాలయ్యాడు. ఇంతియాజ్ కు సహాయ పడిన ఇద్దరు మైనర్లకు కోర్ట్ గతంలోనే శిక్షను విధించగా, నేడు నెల్లూరు కోర్ట్ ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.