Read more!

మోడీకి నవాజ్ షరీఫ్ లవ్ లెటర్!

 

మొన్నామధ్య నరేంద్రమోడీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కి తన ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచినప్పటి నుంచి నవాజ్ షరీఫ్‌కి ఇండియా మీద, మోడీ మీద లవ్వు పెరిగిపోయింది. ఇండియా నుంచి పాకిస్థాన్‌కి వెళ్ళీ వెళ్ళగానే మోడీ మదర్‌‌కి ఒక మంచి చీర గిఫ్ట్.గా పంపించాడు. పర్లేదే.. పాకిస్థాన్ వాడికి కూడా మర్యాద తెలుసు అనుకునేలా చేశాడు. ఇప్పుడు లేటెస్ట్.గా నవాజ్ షరీఫ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. ఆ లేఖలో నవాజ్ షరీఫ్ ఇండియా మీద, మోడీ మీద బోలెడంత ప్రేమని కురిపించాడు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన తనకు ఎంతో సంతోషం కలిగిందట. మోడీతో తాను జరిపిన చర్చలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటిపై దృష్టిసారిస్తామని, మోడీతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.