చినబాబుకు పార్టీ పగ్గాలు
posted on Sep 11, 2015 @ 3:12PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను... త్వరలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేస్తారని తెలుస్తోంది. పార్టీ పగ్గాలు చినబాబుకు అప్పగించాలని ఎప్నట్నుంచో కార్యకర్తలు కోరుతున్నా, సరైన సమయం కోసం బాబు వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తూ, సభ్యత్వ నమోదులోనూ సత్తా చాటిన లోకేష్...ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. పాలనా వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉంటుంటే...చినబాబు పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారని, ఈ నేపథ్యంలోనే లోకేష్ కు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఏపీ, తెలంగాణకు సెపరేట్ గా అధ్యక్షులను నియమించినా, రెండు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను చినబాబే పర్యవేక్షిస్తారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు అంటున్నాయి.