అంబానీ అపర కుబేరుడు

 

ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ వరుసగా ఐదోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. పోర్బ్స్ పత్రిక రూపొందించిన సంపన్నులైన భారతీయుల జాబితాలో ముకేష్ అంబానీని మళ్ళీ మొదటి స్థానం వరించింది. ఏడాది కాలంలో 160 కోట్ల డాలర్లు సంపద కరిగిపోయినప్పటికి ముఖేష్ చేతినుంచి తొలిస్థానం మాత్రం చేజారలేదు. ఈ జాబితాలో రెండో స్థానంలో లక్ష్మి మిట్టల్, మూడోస్థానంలో అజీజ్ ప్రేమ్ జీ, నాల్గో స్థానంలో టాటా గ్రూప్ కి చెందిన పల్లో౦జీ మిస్త్రే, ఐదో స్థానంలో దిలీప్ శంఘ్వీ ఉన్నారు. 900 కోట్ల డాలర్లుతో ఆది గాద్రెజ్ అండ్ ఫ్యామిలి ఆరోస్థానం, 820 కోట్ల డాలర్లుతో సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలి ఏడో స్థానం, 810 కోట్ల డాలర్లుతో శశి అండ్ రవి రుజ ఎనిమిదో స్థానం, 800 కోట్ల డాలర్లుతో హిందూజా బ్రదర్స్ తొమ్మిదో స్థానం, కుమార్ బిర్లా 780 కోట్ల డాలర్లుతో పదో స్థానాన్ని దక్కించుకున్నారు. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ అధినేత విజయమాల్యా ఈ జాబితాలో సోదిలో లేకుండా పోయారు.. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ నష్టాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంవల్ల మాల్యా ఫోర్బ్స్ జాబితాలో 49వ స్థానం నుంచి 73వ స్థానానికి జారిపోయారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.