మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కోదండరాం?
posted on Aug 19, 2014 8:40AM
మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఈ ఆలోచన కోదండరాంకి వుందోలేదో గానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఈ ప్రతిపాదన వచ్చింది.మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రతిపాదించారు. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. చిన్నారెడ్డి ప్రతిపాదన పట్ల పలువురు నేతలు సానుకూలంగా స్పందించారు.