Read more!

ప్రేమించలేదని గొంతుకోసింది..

 

సాధారణంగా ప్రేమించని పాపానికి యువతుల మీద దాడులు జరుగుతూ వుంటాయి. అందుకు పూర్తిగా రివర్స్‌గా వున్న సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. రమణి అనే యువతి తనకు అన్న వరస అయ్యే యువకుడి మీద మనసుపడింది. ప్రేమించానని చెప్పింది. అయితే రాము మాత్రం తప్పు అన్నాడు. అయినా రమణి వినలేదు. వెంటపడి వేధించడం మొదలుపెట్టిది. అయితే రాము మాత్రం ఆమె ప్రేమకు ససేమిరా అంటూ వచ్చాడు. మొన్నీమధ్యే రాము తన మేనకోడలిని పెళ్ళి చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన రమణి సోమవారం సాయంత్రం ఆమె నీతో మాట్లాడాలి, పని ఉందంటూ అతడిని వేదాద్రి వద్దకు పిలిపించింది. అక్కడే అతడిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అక్కడినుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చిన రాము.. చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లు ఏం జరిగిందని అడిగినా ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. అయితే మరింత గట్టిగా అడగడంతో అప్పుడు అసలు విషయం చెప్పాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.