లోక్ పాల్ బిల్లు పై అనేక షరతులు భగ్గుమన్న హజారే

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు వెలుగు చూసే అవకాశం లభించింది. మంగళవారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అత్యంత కీలకమైన ఈ బిల్లును ఆమోదించింది. గురువారం నాడే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అన్నా హజారే బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా లోక్‌పాల్ పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకు వచ్చినప్పటికీ ఇందుకు అనేక షరతులు విధించారు. అలాగే సిబిఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రాకూడదని కూడా ఈ ముసాయిదా బిల్లులో నిర్ణయించారు. సిబిఐని లోక్‌పాల్ పరిధిలోకి తేకూడదని నిర్ణయించడంతో పాటు ఈ దర్యాప్తు సంస్థనుంచి ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను విడదీసేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగ హోదాతో పని చేసే లోక్‌పాల్‌కు తనంతట తానుగానే దర్యాప్తు చేసే అధికారం ఉండదు. కేవలం తనకు నివేదించిన ఫిర్యాదులపైనే ఇది దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దీంతో మరోసారి అన్నా హజారే బృందానికి, ప్రభుత్వానికి మధ్య సంఘర్షణకు రంగం సిద్ధమయినట్లుగానే భావిస్తున్నారు. ఈ ముసాయిదా బిల్లును తిరస్కరించిన హజారే మరోసారి దీక్షకు సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష, 30వ తేదీ నుంచి జైల్‌భరో ఉద్యమాలు చేపట్టనున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.


ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం - లోక్‌పాల్‌లో తొమ్మిదిమంది సభ్యులుంటారు. చైర్మన్‌ను నలుగురు సభ్యుల కమిటీ ఎన్నుకుంటుంది. ఈ కమిటీలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జీల నుంచి ఆయన నామినేట్ చేసిన వ్యక్తి ఉంటారు. అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాపాలన (పబ్లిక్ ఆర్డర్), అణు శక్తి, అంతరిక్షం, అంతర్గత, విదేశీ భద్రత లాంటి అంశాల్లో ప్రధానిపై విచారణ జరిపేందుకు లోక్‌పాల్‌కు అధికారం ఉండబోదు. ప్రధానిపై ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు చేయాలా వద్దా అనే విషయాన్ని లోక్‌పాల్ ఫుల్‌బెంచి నిర్ణయించాలి. అందుకు అందులో కనీసం నాలుగింట మూడొంతుల మంది అంగీకరించాలి. దర్యాప్తు మొత్తం రహస్యంగా సాగుతుంది, ఒకవేళ ఫిర్యాదును కొట్టేస్తే ఆ రికార్డులను బహిర్గతం చేయకూడదు.


మంత్రుల బృందంతో పాటు పలువురు ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు ముసాయిదాపై తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడిన తర్వాత మంగళవారం 70 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ ప్రత్యేక సమావేశంలో రాజ్యాంగ సవరణతో కూడిన లోక్‌పాల్ బిల్లు ముసాయిదాకు ఆమోదం తెలిపారు. బిల్లును లోక్‌సభలో గురువారం ఈనెల 22న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తేవాల్సిందేనని అన్నా హజారే బృందం గట్టిగా పట్టుబట్టినా, ప్రభుత్వం మాత్రం అందుకు తలొగ్గలేదు. దానికి బదులుగా సీబీఐ డైరెక్టర్ నియామకానికి మాత్రం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో విపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు. అలాగే, గ్రూప్ 'సి' ఉద్యోగులను లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న అన్నా డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ఆమోదించలేదు. వారు సీవీసీ పర్యవేక్షణ పరిధిలోకి వస్తారు.


అయితే సీవీసీ మాత్రం లోక్‌పాల్‌కు తన నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. సీబీఐ వద్దకు వచ్చిన కేసులపై లోక్‌పాల్‌కు పర్యవేక్షణ అధికారం ఉంటుంది. సీబీఐలో ఎస్పీలు, అంతకంటే ఉన్నతాధికారుల నియామకాన్ని సీవీసీ, విజిలెన్సు కమిషనర్లు, హోం శాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణశాఖ కార్యదర్శులతో కూడిన ఓ కమిటీ చూస్తుంది. లోక్‌పాల్ తనంతట తానుగా ఎలాంటి విచారణలు నిర్వహించకూడదు. అందుకు ఫిర్యాదు తప్పనిసరి. ప్రాథమిక విచారణ జరపాల్సిందిగా సీబీఐని కూడా లోక్‌పాల్ కోరొచ్చు. ఆ విచారణ 180 రోజుల్లోగా పూర్తికావాలి. సీబీఐకి వివిధ కేసులపై తన నివేదికలను లోక్‌పాల్‌కు అందించాలి.


లోక్ పాల్ బెంచిలోని కనీసం ముగ్గురు సభ్యులు ఆ నివేదికను చూసి.. చార్జిషీటు దాఖలుచేయాలా, అసలు మూసేయాలా లేక శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించాలా అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. లోక్‌పాల్ బెంచితో పాటు సెర్చికమిటీలో కూడా ఎస్సీ/ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలకు 50% రిజర్వేషన్ ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం సభ్యుల్లో సగం మంది సభ్యులకు న్యాయ నేపథ్యం ఉండాలి. లోక్‌పాల్ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు ఉంటుంది. కనీసం వంద మంది ఎంపీలు కోరితే తప్ప చైర్మన్ లేదా సభ్యులపై అభిశంసన చేపట్టేందుకు వీల్లేదు. లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ఇలాగే ప్రవేశపెడితే తాము వ్యతిరేకిస్తామని బీజేపీ తెలిపింది. ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లు ప్రజలకు వెన్నుపోటులాగే ఉందని, ఇలాంటి అసమర్ధ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. సీబీఐని లోక్‌పాల్ పరిధి నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”