ప్రశాంతంగా ఏడో దశ పోలింగ్

దేశంలో  చివరి దైన ఏడో దశ పోలింగ్ శనివారం (జూన్1) ప్రశాంతంగా సాగుతోంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలతో పాటు, ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్ లో 13, పంజా బ్ లో 13, పశ్చిమ బెంగాల్ లో 9, బీహార్ లో 8, ఒడిశా లో 6, హిమాచల్ ప్రదేశ్ లో 4, ఝార్ఖండ్ లో 3, ఛండీ గఢ్ లో ఒక లోక్ సభ స్థానా నికి ఎన్నికలుజరగను న్నాయి 

చివరి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తదితరులు ఉన్నారు. 

ఏడో దశ పోలింగ్ లో 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  పోలింగ్ తీరును పర్యవే క్షించేందుకు 172 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు.  అలాగే 2,707 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2,799 స్టాటిక్ సర్విలెన్స్  బృందాలు,  1,080 నిఘా బృందాలు, 560 వీడియో మానిటరింగ్ టీమ్ లను ఏర్పాటు చేశారు. రహదారి తనిఖీల నిమిత్తం దాదాపు 1,100కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తుది విడత పోలింగ్ ముగిసిన తరువాత సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4న జరుగుతుంది. 

Teluguone gnews banner