Read more!

కొప్పుల ఈశ్వర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్?

 

కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెరాస యం.యల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఈరోజు తనకూ పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంటుందని ఆయన చాలా ఆశపడ్డారు. కానీ, కేసీఆర్ మొదటి జాబితాలో ఆయన పేరు కనబడలేదు. కొప్పుల ఈశ్వర్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వంలో తనకు కీలక మంత్రి శాఖ దొరుకుతుందని ఆశించారు. కేసీఆర్ ఈ నెల 15 తర్వాత మళ్ళీ తన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. కనీసం అప్పుడయినా మంత్రి పదవి దక్కవచ్చని ఆశపడుతున్న ఈశ్వర్ కు కేసీఆర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పదవిని ఖరారు చేసినట్లు తాజా సమాచారం. అందుకు ఆయన స్పీకర్ పదవి తీసుకొనేందుకు అంగీకరిస్తారా లేదా? చూడాలి.