కోడ్ ఉల్లంఘించిన కేంద్ర మంత్రి.. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు

కేంద్ర మంత్రి, సికిందరాబాద్ లోక్ సభ నియోజవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత చేసిన ప్రసంగంలో కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

పోలింగ్ రోజున ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ పేరు ప్రస్తావించారనీ, నిబంధనల మేరకు పోలింగ్ రోజున పార్టీ పేర్లు, గుర్తుల పేర్లు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం నిషేధమని కాంగ్రెస్ ఆ ఫిర్యాదులో పేర్కొంది.

పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెబుతూ మోడీ పేరు ప్రస్తావించిన కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని వారా ఫిర్యాదులో కోరారు.  

Teluguone gnews banner