నరసరావుపేట వైసీపీ అభ్యర్థి ఓవర్ యాక్షన్!
posted on May 13, 2024 @ 12:44PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు పూనకం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదా కార్యకర్తలు నిబంధనలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. అదేమని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. నరసరావుపేట పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హడావిడి చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు అసెంబ్లీ లేదా పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థి కేవలం ఒక వాహనంలో మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం 10 కార్లతో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. శ్రీనివాసరెడ్డి వెంట దాదాపు వంద మంది అనుచరులు కమ్ గూండాలు వుంటున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిబంధనలు బ్రేక్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి.