కేజ్రీవాల్ కి వార్నింగిచ్చిన సల్మాన్ ఖుర్షీద్

 

అరవింద్ కేజ్రీవాల్ ని చంపుతానని అర్థం వచ్చే వాడి వేడిమాటలతూటాలను ప్రయోగించి కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తనకు తానుగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. దమ్ముంటే యూపీలోని తన సొంత నియోజకవర్గం ఫరీదాబాద్ కొచ్చి నిరసన తెలపాలంటూ కేజ్రీవాల్ కి సవాల్ విసిరిన ఖుర్షీద్ అలా జరిగితే కేజ్రీవాల్ తిరిగి వెనక్కెళ్లే అవకాశమే లేదంటూ సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. ఫరీదాబాద్ నుంచి ఎలా తిరిగి వెళ్తాడో చూస్తాననడం తనని చంపుతానంటూ బాహాటంగానే బెదిరించడమేనని కేజ్రీవాల్ అంటున్నారు. ఖుర్షీద్ మంత్రిలా కాక మాఫియా డాన్ లా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను న్యాయశాఖమంత్రిని కాబట్టి కలంతో పనిచేయాల్సొస్తోందని, లేకుంటే కత్తితో పనిచేసే తరీఖాకూడా తెలుసని ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ టీవీ ఛానెళ్లు విస్తృతంగా ప్రసారం చేశాయ్. ఖుర్షీద్ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే తనకు ప్రాణహాని తలపెట్టాలన్న ఉద్దేశం ఆయనకు ఉందన్న విషయం స్పష్టమౌతుందని కేజ్రీవాల్ అంటున్నారు. తన మరణం దేశాన్ని జాగృతం చేయగలిగితే వందలాదిమంది కేజ్రీవాల్ లు దేశంకోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడతారని ఆయన అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.