Read more!

ఎక్కువ చేస్తే మీడియాపై యాక్షన్: కేసీఆర్

 

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకి వార్నింగ్ ఇచ్చారు. గతంలో మీడియాకి వార్నింగ్ ఇచ్చిన నాయకులు ఎలాంటి ఫలితాలను చవిచూశారో తెలిసినప్పటికీ కేసీఆర్ మీడియాకి వార్నింగ్ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో వెటకారంగా వార్తలు ప్రచారం చేస్తే మీడియాపై చర్చలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హెచ్చరించారు. టీవీ9, ఆంధ్రజ్యోతి మీద ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాదన్నట్టు కథనాలు ప్రసారం చేసినందుకు సదరు ఛానళ్ళ మీద కేసీఆర్ విరుచుకుపడ్డారు. కొన్ని ఛానళ్ళు, పత్రికల తీరు మీద శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలను అవమానించిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచిన మీడియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిమీద కేసీఆర్ స్పందిస్తూ మీడియా మీద మండిపడ్డారు.