జగన్‌కు నోటీసులపై శంకరరావు రెస్పాన్స్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల తవ్వకాల కేసులో  సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు ఆహ్వానించారు .ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడినా కోర్టులు ఊరుకోవన్నారు. రహేజాపై తాను కోర్టుకు లేఖ రాశానని ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఈ నెల నాలుగో తేదిన ఏర్పాటు చేసిన బోర్డు సమావేశాన్ని ఏపిఐఐసి రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై తనకు సానుకూల సందేశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Teluguone gnews banner