కింగ్ కోహ్లీ బాదేశాడు.. బెంగళూరును గెలిపించాడు!
posted on Mar 26, 2024 @ 2:07PM
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో గెలిచి 2024 సీజన్లో తొలి విజయం సాధించింది ఆర్సీబీ. విరాట్ కోహ్లి 49 బంతుల్లో 11×4, 2×6 సాయంతో 77 పరుగులు అద్భుతంగా రాణించడంతో ఆసక్తికరంగా సాగిందీ మ్యాచ్. ఫలితంగా ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలిచింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. తొలి బాల్ నుంచే ఆచీతూచీ మ్యాచ్ ఆడింది. ప్రత్యర్థులు వేసిన బంతులను చాకచక్యంగా ఎదుర్కొని మంచి స్కోర్ చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 37 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. జితేశ్ శర్మ 20 బంతుల్లో 1×4, 2×6 సాయంతో 27 పరుగులు చేశాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ 17 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 25 పరుగులు అందించాడు. సామ్ కరన్ 17 బంతుల్లో 3×4 సాయంతో 23 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో వచ్చిన శశాంక్ సింగ్ 21 కూడా కీలక ఇన్నింగ్స్ అందించాడు. సిరాజ్, మ్యాక్స్వెల్ తలో రెండు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్,యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక 177 పరుగుల ఛేధనలో కోహ్లీ చేసిన స్కోరును సద్వినియోగం చేసుకున్నాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ 10 బంతుల్లో 3×4, 2×6 సాయంతో 28 నాటౌట్గా నిలిచాడు. లొమ్రార్ 8 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 17 నాటౌట్ మంచిగా రాణించాడు. దీంతో ఆర్సీబీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్ప్రీత్ బ్రార్ 2/13, రబాడ 2/23 అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ష్దీప్ 3.2 ఓవర్లలో 40, హర్షల్ పటేల్ 1/45 ధారాళంగా పరుగులిచ్చేశారు.
బెంగళూరు తుది జట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
పంజాబ్ తుది జట్టు :
శిఖర్ ధావన్ (కెప్టెన్), కగిసో రబాడ, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.