Read more!

బాధితుల వివరాల కోసం కంట్రోల్ రూమ్

 

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహాయక చర్యలను చేపట్టాయి. బాధిత విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం నెంబర్లు 040-23202813,  9440815887. అలాగే హిమాచల్‌లోని హెల్ప్‌లైన్ నెంబర్ ల్యాండ్‌ఫోన్ 1902-224455.