Read more!

దడపుట్టిస్తున్న వడదెబ్బ: 14 మంది మృతి

 

 

 

గురువారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బ దడ పుట్టించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా వడగాలులు వీస్తున్నాయి. వడగాలులకు భయపడిన జనం ఇళ్ళలోంచి బయటకి కూడా రావడం లేదు. స్కూళ్ళు కూడా మూసేశారు. వడదెబ్బ కారణంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో గురువారం నాడు మొత్తం 14 మంది మరణించారు. విశాఖ జిల్లా కశింకోటలో నలుగురు, విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ముగ్గురు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఒకరు, విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఒకరు, గొల్లప్రోలు మండలంలో ఒకరు వడదెబ్బ కారణంగా మరణించారు. ఈ వాతావరణ పరిస్థితి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.