ఎస్ఎంఎస్లపై నిషేధం ఎత్తివేత
posted on Aug 30, 2012 @ 4:31PM
రోజుకు ఐదు ఎస్ఎంఎస్ల కంటే ఎక్కువ పంపకూడదన్న నిషేధాన్ని కేంద్రప్రభుత్వం గురువారం ఎత్తివేసింది. అసోంలో మత ఘర్షణలు చెలరేగడానికి ఈ ఎస్ఎంఎస్లే మూల కారణమని గుర్తించిన కేంద్రం, ఎస్ఎంఎస్లపై నిషేధం విధించింది. వాటిపై విచారణ జరిపిన ప్రభుత్వం అవి దొంగ ఎస్ఎంఎస్లుగా గుర్తించి నిషేధం ఎత్తివేసింది. అసోంలో చెలరేగిన అల్లర్ల కారణంగా భయభ్రాంతులకు గురై ఈశాన్య ప్రాంతాలవారు తమ, తమ ప్రాంతాలకు తరలిపోయిన విషయం తెలిసిందే.