అర్ధరాత్రి యువతిపై సామూహిక అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మోరంపూడి వద్ద ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళి తిరీగి అర్ధరాత్రి దాటిన తర్వాత తన బాబాయితో కలిసి మోరంపూడికి బయలుదేరింది. వారిద్దరూ ఓ ఆటో ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు ఆ యువతి చిన్నాన్నను ఆటోలో నుండి కిందకు తోసేశారు. అనంతరం ముగ్గురు కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు. యువతి చిన్నాన్న బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడిన యువకులు తప్పించుకొని పారిపోయారు. పోలీసులు నిందితులను ముగ్గురిని పట్టుకోవడానికి స్థానిక ఆటో డ్రైవర్లను, పరిసర ప్రాంతాల వారిని విచారిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.