ప్రజల మెడకు గ్యాస్ గుదిబండ

 

యూపీఏ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. పైసా రావాలంటే పెటపెటలాడుతోంది.. అప్పుల తిప్పలు ఆఖరి అంకానికి వచ్చేశాయ్.. డబ్బులేమైనా చెట్లక్కాస్తున్నాయా.. అంటూ చిర్రుబుర్రులాడిన ప్రథాని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ ని దేశంలోకి అనుమతించేందుకు పచ్చజెండా ఊపింది అందుకే.. సబ్సిడీల భారాన్ని మోయడంవల్ల ఒరిగేదేంలేదని యూపీఏ సర్కారు గ్రహించింది. అందుకే సబ్సిడీలకు అన్ని వైపులనుంచీ కోతలు పెట్టేందుకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయ్. వంటగ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేసే విషయంలో సర్కారు ఆగమేఘాలమీద నిర్ణయంకూడా తీసేసుకుంది. వచ్చే ఏప్రియల్ నుంచి వంటగ్యాస్ బండ రేటు రూ. 967. ఇకపై అందరికీ రాయితీ లేని సిలిండర్లే అందుబాటులోకొస్తాయ్. ఒకేసారి సబ్సిడీల్ని పూర్తిగా ఎత్తేస్తే ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది కనుక సర్కారు తెలివిగా అంచెలంచెలుగా సబ్సీడీలకోత విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏప్రియల్ నెలనుంచి గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని బ్యాంక్ అకౌంట్లలో జమచేయాలని చమురు కంపెనీలు, ప్రభుత్వం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాయ్. కొంతకాలంపాటు ఇలా నేరుగా డబ్బు చెల్లించే పద్ధతిని వినియోగదారులకు అలవాటు చేస్తూ సబ్సిడీని బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తూ పోతే.. తర్వాత్తర్వాత బ్యాంక్ అకౌంట్లలో జమ విషయాన్ని వదిలేసినా జనం పెద్దగా పట్టించుకోని స్తితికి చేరుకుంటారన్నది ఆర్థిక నిపుణుల అంచనా.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.