రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీలు, డీలర్లకు జాక్ పాట్

వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గట్టిగా అమలౌతోంది. దీన్ని గాడిలో పెట్టేందుకు గ్యాస్ ఏజెన్సీలు, డీలర్లు పాస్ బుక్ ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికొచ్చినబాయ్.. పాస్ బుక్ ఉంటేనే డెలివరీ ఇస్తున్నాడు. పాస్ బుక్ సమయానికి కనిపించకపోయినా, లేకపోయినా సిలిండర్ ఇవ్వడానికొచ్చిన కుర్రాడికి మరో యాభై రూపాయలు అదనంగా సమర్పించుకోక తప్పనిపరిస్థితి. గ్యాస్ బుక్ లేనివాళ్లకు, అందుబాటులో లేనివాళ్లకు అదనపు వాయింపు తప్పనిసరయ్యింది. అప్పటికప్పుడు కొత్త పాస్ బుక్ ఇష్యూచేసే సదుపాయాన్ని రాష్ట్రంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలు, అందరు డీలర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. పాస్ బుక్ లేకపోతే గ్యాస్ సిలిండర్ లేదు అనే నినాదాన్ని విస్తృతంగా, స్వచ్ఛందంగా ప్రచారం చేసుకుంటున్నారుకూడా.. గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సమయంలో ఇచ్చిన పత్రాల్ని చూపిస్తేచాలు కొత్త పాస్ బుక్ ఇచ్చేసినట్టే..

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.