బెయిల్ స్కామ్ కేసులో గాలికి 11 రోజులు రిమాండ్

బెయిల్ ఫర్ సేల్ స్కామ్ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఉదయం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు సంబంధించి పలు అంశాలపై కోర్టు విచారణ జరపి గాలి జనార్ధన్‌రెడ్డికి 11 రోజులు రిమాండ్ విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. అయితే గాలిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరగా కోర్టు నిరకరించింది. బెంగళూర్ జైలులో ఉన్న గాలిని హైదరాబాదుకు తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కుటుంబసభ్యులతో మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్‌రెడ్డి కోరగా పది నిమిషాల సమయాన్ని కోర్టు కేటాయించింది. కనీసం అర్ధగంట సమయాన్ని ఇవ్వాలని గాలి తరపు న్యాయవాదులు కోరడంతో కోర్టు అంగీకరించింది. గాలి కేసు సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కోర్టుకు తరలివచ్చారు. బళ్లారి ఎమ్మెల్యే శ్రీరాములు, రాయచూర్ ఎంపీ ఫకీరప్ప కోర్టుకు వచ్చారు. వారిని చూసిన గాలి కోర్టులో కంటతడిపెట్టుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం గాలిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.