నచ్చితే నేరుగా కావలించుకోవచ్చు

 

నచ్చిన దాన్ని మెచ్చుకోవడం చాలామందికి అలవాటు.. అందమైనదాన్ని దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవాలన్న వేడిపుట్టడంలోనూ తప్పులేదు.. అది ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకూ.. ఈ క్లాజ్ ని వ్యక్తిగత స్పర్శకు వర్తింపజేయడానికి సోషల్ లైఫ్ లో చాలా పరిమితులుంటాయ్. కానీ.. అనుకున్నదే తడవుగా ముద్దొచ్చినదాన్ని గట్టిగా హత్తుకోవాలన్న కలను నిజంచేసుకోవడానికి ఇప్పుడు సరికొత్త మార్గాలు అందుబాటులోకొచ్చాయ్. మామూలుగా ఫేస్ బుక్ లో నచ్చిన కామెంట్ కి లైక్ పోస్ట్ ఇవ్వడం చాలాకాలంనుంచి వస్తున్న లేటెస్ట్ ఆచారం. అలా నచ్చినవాళ్లని మెచ్చుకుని గట్టిగా కౌగిలించుకోవలనుకున్నప్పుడు ఆవతలివాళ్లు ఎక్కడున్నా ఆ బిగి కౌగిలిని అందుకోగలిగే ఛాన్స్ ఇప్పుడు అందుబాటులోకొచ్చేసింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బిగి కౌగిలి జాకెట్ ని ధరిస్తే చాలు అవతలివాళ్లు నేరుగా కౌగిలించుకున్న ఫీలింగ్ కలుగుతుందట. జాకెట్ లో ఉన్న గాలి తిత్తులు ఉబ్బి కావలించుకున్న ఫీలింగ్ వచ్చేస్తుందట. మళ్లీ గట్టిగా జాకెట్ ని కావలించుకుంటే అవతలివాళ్లకు ఆ సిగ్నల్ వెళ్లిపోయి అక్కడకూడా సేమ్ ఫీలింగ్. సెల్ ఫోన్ ద్వారా పనిచేసే ఈ కొత్త జాకెట్ పుణ్యమా.. అని నచ్చినవాళ్లను ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ కౌగిలించుకోగలిగే అవకాశం రావడం నిజంగా అదృష్టం కదూ.. కాకపోతే ఈ ఫెసిలిటీని గట్టిగా... వినియోగించుకోవడానికి ఫేస్ బుక్ అకౌంట్ తప్పని సరిగా ఉండాలి మరి..

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.