కొనసాగాలా? వద్దా.. ఎలాన్ మస్క్ సంశయం
posted on Dec 19, 2022 @ 1:03PM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏ ముహూర్తాన ట్విట్టర్ పగ్గాలు తీసుకున్నాడో ఆ క్షణం నుంచీ అత్యంత వివాదాస్పదుడిగా మారిపోయాడు. కేవలం టెస్లా అదినేతగా ఉన్నంత కాలం ఎలాన్ మస్క్ విషయంలో ఎలాంటి వివాదాలూ లేవు. కానీ ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు అందుకున్నాడో ఆ క్షణం నుంచీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామిక వేత్తగా మారిపోయాడు.
ట్విట్లర్ లో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం నుంచీ ట్వీట్టర్ విధానాలలో మార్పులు చేయడం వరకూ, తన విధానాలను వ్యతిరేకించే జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించడం నుంచి.. ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతుందని ప్రకటించడం వరకూ ఎలాన్ మస్క్ ప్రతి చర్యా, ప్రతి అడుగూ వివాదాస్పదంగానే తయారైంది. అయితే తాజాగా ట్విటర్ల వ్యవహారాలపై తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో ఎలాన్ మస్క్ అంతర్మథనంలో పడ్డారు. ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న మీమాంశలో పడ్డారు.
ఇంత కాలం ట్విట్టర్ కు షాక్ ల మీద షాక్ లు ఇచ్చిన సీఈవో ఎలాన్ మస్క్.. తనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో అసలు ట్విట్లర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. అదేదో సినిమాలో హీరో ప్రేమించాలా వద్దా అన్న డైలమాలో పడిన విధగా తయారైంది ఇప్పుడు ఎలాన్ మస్క్ పరిస్థితి. సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న తన సంశయాన్ని తీర్చుకోవడానికి ఆయన నెటిజన్లు ఆశ్రయించాడు.
తాను ట్వట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అంటే ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టాడు. అందులో 58 శాతానికి పైగా ఎలాన్ మస్క్ వైదొలగాలనే ఓటు చేశారు. ఓ 42 శాతం మంది మాత్రం ఎలాన్ మస్క్ కు అనుకూలంగా ఓటేశారు.