తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు
posted on May 23, 2024 9:12AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో వారంతంలోనే కాకుండా సాధారణ రోజులలో కూడా తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది.
గురువారం (మే 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ కాంప్లెక్స్ దాటి ఏటీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.
బుధవారం శ్రీవారిని మొత్తం 80 వేల048 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 35 వేల 403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 17 లక్షల రూపాయలు వచ్చింది.