బొగ్గుకుంభకోణంపై దాసరిని ప్రశ్నించిన సిబిఐ
posted on Sep 4, 2012 @ 2:12PM
బొగ్గుకుంభకోణానికి సంబంధించి గతంలో గనులశాఖ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణవుని సిబిఐ ప్రశ్నించిందని మీడియాలో పెద్ఎత్తున ప్రచారం జరుగుతోంది. పలుకంపెనీలకు బొగ్గు కేటాయింపులపై దాసరినుంచి వివరాలు సేకరించిన సిబిఐ.. ఐదు కంపెనీలపై చార్జ్ షీట్ దాఖలు చేసిందని, మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో దాసరిని అధికారులు ప్రశ్నించారని లోకల్ మీడియా కోడైకూస్తోంది. కానీ.. దాసరి నారాయణరావుమాత్రం తనని సిబిఐ అధికారులు ప్రశ్నించలేదని, మీడియాలో ఈ విషయంపై ప్రసారమౌతున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ దాసరి ఓ ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేశారు.