పదవులకు రాజీనామా చేసే టైం వచ్చింది: జానా

టీ. ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడం పై జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల అరెస్ట్‌ బాధాకరమన్నారు, వెంటనే టీ. కాంగ్రెస్ ఎంపీలను విడుదలచేయాలని అన్నారు. తెలంగాణ కవాతుపై ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను కుడా వెంటనే విడుదల చేయాలని, అవసరమైతే భవిష్యత్‌లో పదవులను లెక్కచేయని పరిస్థితులు ఎదురుకావొచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. అలాగే, కవాతుపై ఉద్యమ నేతలు ఇచ్చిన హామీని సైతం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.


మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు హైదరాబాదు, తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తలను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో ధూంధాం నిర్వహిస్తున్న వారిని, ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతంలో ర్యాలీగా వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవాతుకు అనుమతి ఉన్నప్పటికీ ర్యాలీగా వస్తే మాత్రం అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు.
     

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.