గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి!

పోలవరం పనులు ఇక రాకెట్ వేగంతో సాగనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు నిర్దుష్ట గడువు నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు శుక్రవారం (అక్టోబర్ 3) అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి కావాలనీ, అందుకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా అధికారులు పనుల వేగం పెంచాలని ఆదేశించారు. అదే సమయంలో పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. అవసరమైన అనుమతులను  కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి   తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు.  డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్  మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు.

బట్రస్ డ్యామ్ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74శాతం మేర పూర్తయినట్లు సీఎంకు తెలియ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈఏడాది డిసెంబరు  నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు 1 నుంచి  ప్రారంభించాలని.. 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చంద్రబాబు అధికారులకు డెడ్ లైన్ విధించారు. అలాగే.. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి వన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. 

దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలన్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటి కప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్ కు అనుసంధానించాలని సూచించారు 

గిల్‌ను తప్పిస్తున్నట్లు ముందే చెప్పారా?

  టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును శనివారం ప్రకటించారు. ఇందులో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుత టీమిండియా టెస్ట్, వన్డే ఫార్మాట్‌ల కెప్టెన్, టీ20 వైస్ కెప్టెన్.. గిల్‌ను స్టాండ్ బైగా కూడా సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం క్రికెట్ పండితులు కూడా ఊహించలేదు. గిల్ కూడా న్యూజిలాండ్ సిరీస్, ప్రపంచ కప్‌లో ఆడేందకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.  అయితే తనపై వేటు పడుతుందని గిల్‌కు ముందే తెలుసు అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కుడి పాదానికి గాయం అవ్వడంతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు టీ20లకు గిల్ జట్టులో లేడు. శనివారం అహ్మదాబాద్‌ను వీడి చండీగఢ్‌కు బయల్దేరిన సమయంలో సెలక్షన్ కమిటీ భేటీ జరిగింది. జట్టును ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందే బీసీసీఐ నుంచి గిల్‌కి ఫోన్ వచ్చింది. తనను జట్టులోంచి తప్పించిన విషయాన్ని చెప్పారు.  ఈ విషయాన్ని క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే గిల్‌కు ఎవరు ఈ విషయం గురించి చెప్పారనే అంశం మాత్రం బయటకు రాలేదు. గిల్‌ తొలుత గాయంతోనే దక్షిణాఫ్రికాతో టీ20 ఆడేందుకు సిద్ధపడ్డాడు. కానీ మైదానంలోకి దిగితే అది మరింత తీవ్రమై కీలక టోర్నమెంట్లకు దూరం కావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాతే బీసీసీఐ కూడా అతడికి గాయమైన విషయాన్ని ధ్రువీకరించింది. లఖ్‌నవూలో డిసెంబర్‌ 16న నెట్‌ప్రాక్టీస్‌ సమయంలో గిల్ గాయపడ్డాడు. దీంతో జట్టులో ఆడేందుకు సంజుకు అవకాశం లభించింది.  

సర్పంచ్ తండ్రి కోసం కొడుకు బిక్షాటన

  తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమ తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని 'బిచ్చగాడు సినిమా తరహాలో ప్రతిన బూనాడో కుమారుడు.  రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఎం.రామకృష్ణయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు.  ఇదే ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు కూడా బరిలో దిగాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు భాస్కర్.. తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే.. భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే.. తన తండ్రి సర్పంచ్ అయ్యారు. మొక్కుబడి చెల్లించడంలో భాగంగా భాస్కర్ ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి.. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్త క్షేత్రానికి వెళ్లాడు. ఈ ఘటనపై జే.లింగాపూర్ గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిపై గల కుమారుడికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

ఎప్‌స్టిన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ మాయం.. ట్రాంప్ ఫొటో సహా

  ఎప్‌స్టీన్‌ తాజాగా విడుదల చేసింది, అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్స్ వంటి ప్రముఖుల ఫోటోలున్నాయి. అవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కొన్ని ఫైళ్లు మాయమవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాయమైన 468 నెంబరు ఫైళ్లలో ట్రంప్‌తో పాటు మెలానియా, ఎప్‌స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ ఫొటోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఫొటోలలో కేవలం నేరగాళ్లే కాకుండా.. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనిపించడం విస్తుగొలుపుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రపంచ ప్రఖ్యాత భాషావేత్త నోవమ్ చోమ్స్కీ , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లాంటి వారు ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు.  గతంలోనే వీరికి ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ తాజా చిత్రాలు ఆ బంధాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి.  ఫొటోలతో పాటు కొన్ని కీలకమైన చాటింగ్ స్క్రీన్ షాట్ లను కూడా కమిటీ బయటపెట్టింది. అందులో ‘నేను ఇప్పుడే అమ్మాయిలను పంపుతున్నాను’ అనే అర్థం వచ్చే సందేశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఎప్ స్టీన్ నడిపిన అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా వంటి దేశాలకు చెందిన మహిళల పాస్ పోర్టుల కాపీలు కూడా అక్కడ లభ్యమయ్యాయి.  అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మహిళల పేర్లను వివరాలను అధికారులు బ్లర్ చేశారు. తూర్పు యూరప్ దేశాల నుంచి యువతులను ప్రలోభ పెట్టి అమెరికాకు రప్పించి వారిని ప్రముఖుల కోసం వినిగించేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. వాటితో పాటు ఎప్‌స్టీన్  కథనం ప్రకారం బాధితుల నుంచి ఎఫ్‌బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మోమోలు వంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు సమాచారం.  అయితే వీటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? అనుకోకుండా జరిగిందా? అనే విషయాన్ని న్యాయశాఖ స్పష్టం చేయలేదు. అదృశ్యమైన ఫైళ్ల విషయం బహిర్గతం అవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.  హౌస్ ఓవర్ నైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలార్నీ జనరల్ పామ్ బోందీ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ‘ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికన్ ప్రజలకు , మాకు పారదర్శకత అవసరం’ అని ఎక్స్‌లో ఓ పోస్టులో రాసుకొచ్చారు.

శేషాచలం అడవుల్లో దివ్య ఔషధ వనం

  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ రూ.4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు జీవనాడిగా దివ్య ఔషధ వనం అభివృద్ధి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ సంకల్పించింది. ఔషధ మొక్కలను సంరక్షిస్తూ, ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తోడ్పడనుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ తరహాలో రూపొందనున్న ఈ ఔషధ వనం భక్తులు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తి–విజ్ఞానం–ప్రకృతి సమ్మేళనం టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, ఋతు వనం, విశిష్ట వృక్ష వనం, ఔషధ మొక్కలు వంటి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా, ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి. రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటు తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచి, భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలిపింది.  

రూ.2 కోట్లు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్మీ అధికారి

  లంచం తీసుకున్న కేసులో భారతీయ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మతో పాటు ప్రైవేట్ వ్యక్తి వినోద్ కుమార్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)  అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారంతో డిసెంబర్ 19న ఈ కేసును నమోదు చేసిన సీబీఐ, లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ (డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ – ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ), ఆయన భార్య కల్నల్ కాజల్ బాలి (కమాండింగ్ ఆఫీసర్, 16 ఇన్ఫాంట్రీ డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్, శ్రీగంగానగర్, రాజస్థాన్)తో పాటు దుబాయ్‌కు చెందిన ఓ కంపెనీతో సహా మరికొందరిపై క్రిమినల్ కుట్ర, లంచం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. సీబీఐ విచారణ ప్రకారం... లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ రక్షణ ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు నిర్వహించే పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కై, వారికి అనుచిత లాభాలు చేకూర్చినందుకు ప్రతిఫలం గా లంచాలు స్వీకరిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అదే విధంగా, రాజీవ్ యాదవ్ మరియు రవ్జిత్ సింగ్ అనే వ్యక్తులు ఆ కంపెనీకి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ బెంగళూరులో స్థిరపడి, లెఫ్టినెంట్ కల్నల్ శర్మతో తరచుగా సంప్రదింపులు కొనసాగిస్తూ పలు ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల నుంచి అక్రమ మార్గాల్లో లాభాలు పొందేందుకు ప్రయత్నించినట్లు సీబీఐ తెలిపింది. ఈ క్రమంలో డిసెంబర్ 18న వినోద్ కుమార్ అనే వ్యక్తి, కంపెనీ ఆదేశాల మేరకు లెఫ్టినెంట్ కల్నల్ శర్మకు రూ.3 లక్షల లంచం అందజేశాడని ఆరోపణలు ఉన్నాయి.  ఈ కేసులో భాగంగా శ్రీగంగానగర్, బెంగళూరు, జమ్మూ తదితర ప్రాంతాల్లో సీబీఐ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ నివాసంలో జరిగిన సోదాల్లో రూ.3 లక్షల లంచం...  అదనంగా రూ.2,23,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీగంగానగర్‌లోని ఆయన ఇంట్లో రూ.10 లక్షల నగదు సహా కీలక ఆధారాలు లభ్యమైనట్లు సీబీఐ వెల్లడించింది. న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయ ప్రాంగణంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అరెస్టైన లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ, వినోద్ కుమార్‌లను  కోర్టులో హాజరుపరిచిన అధికారులు, డిసెంబర్ 23 వరకు పోలీస్ కస్టడీకి అనుమతి పొందారు. ఈ కేసుపై మరింత విచారణ కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది.

ప్రేమ సహజీవనం ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న నిందితుడు అరెస్ట్

  ప్రేమ పేరుతో యువతులను వలలో వేసి, సహజీవనం ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల ముఠా వ్యవహారాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో – హెచ్ న్యూ  అధికారులు బట్టబయలు చేశారు. ఈ కేసులో యోమెన్‌కు చెందిన ఒక నైజీరియన్ వ్యక్తిని అధికా రులు అరెస్ట్ చేశారు. విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చిన నిందితుడు, గత నాలుగేళ్లుగా పోలీసుల చేతికి చిక్కకుండా డ్రగ్స్ విక్రయాలు చేస్తూ, యువతు లను తన అక్రమ కార్యక లాపాలకు ఏజెంట్లుగా మార్చుకుంటున్నట్లు భారీ ఎత్తున డబ్బులు సంపా దిస్తూ... ఎంజాయ్ చేస్తు న్నాడని విచారణలో వెల్లడైంది.  ప్రేమ పేరుతో యువతులకు గాలం ఈ నైజీరియన్ ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి ఈ అక్రమ డ్రగ్స్ దందాలోకి దింపేవాడు. ఇప్పటివరకు ఏడుగురు యువతులతో ప్రేమ, సహజీవనం పేరుతో సంబంధాలు కొనసా గించి నట్లు అధికారులు గుర్తిం చారు.యువతులను టార్గెట్ చేసిన నిందితుడు డ్రగ్స్ అలవాటు పడిన యువతు లను ముందుగా గుర్తించి, వారికి ఉచితంగా మత్తు పదార్థాలు అందిస్తూ పరిచ యం పెంచుకున్నాడు. ఆ తరువాత ప్రేమ, సహజీవనం పేరుతో వారిని తన నియంత్ర ణలోకి తీసుకున్నాడు. అనంతరం డ్రగ్స్ సరఫరా, తర లింపు బాధ్యతలను వారిపైనే మోపుతూ ఏజెంట్లుగా మలి చేవాడు.నగరాలు మారుతూ దందా మూడు నెలలకు ఒకసారి ఒక నగరం నుండి మరొక నగరానికి మారుతూ పోలీసులకు చిక్కకుండా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతు న్నాడు...  హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లో ఇప్పటికీ ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని డ్రగ్స్ దందా యదేచ్చగా సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండకుండా మారుతూ ఉండటంతో నాలుగేళ్లుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకున్నాడు.కొంపల్లి ఘటనతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలో నర్సుగా పనిచే స్తున్న ఓ యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు, ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేస్తూ, ఆమె నివాసంలోనే మత్తు పదార్థాలను నిల్వ చేశాడు. అను మానాస్పద సమాచారం అందడంతో నార్కోటిక్ అధి కారులు దాడులు నిర్వహిం చగా, ఈ డ్రగ్స్ అక్రూ దందా  కాస్త వెలుగులోకి వచ్చింది. కోడ్ భాషలో డ్రగ్స్ లావా దేవీలు  డ్రగ్స్ విక్రయా లకు నిందితుడు ప్రత్యేక కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూడు ప్రశ్నార్థక చిహ్నాలు (???) పంపితే – “మాల్ కావాలి” అనే అర్థం.... నిందితుడి నుంచి మూడు చుక్కలు (…) వస్తే – డ్రగ్స్ రెడీగా ఉన్నట్లు సంకేతం... ఓషన్ గంజా కోసం “సముద్రం” అనే పదం. గ్రీన్ MDMA కోసం ప్రత్యేక సింబల్స్ వినియోగం. ముంబైలో డ్రగ్స్ స్మగ్లర్లు MDMAకు ఉపయోగిస్తున్న కోడ్ భాషను ఇప్పటికే  HNEW పోలీసులు గుర్తించారు. ఈ నిందితుడి కమ్యూనికేషన్‌ను ట్రాక్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.డ్రగ్స్ సరఫరాలో అన్ని రకాల మత్తు పదార్థాలకు కామన్ కోడ్‌గా “స్కోర్” అనే పదాన్ని వాడుతున్నట్లు విచారణలో తేలింది. “మామ స్కోర్ చేసావా?” అంటూ ఆర్డర్ ఇచ్చి డ్రగ్స్ లావాదేవీలు నిర్వహించేవాడని అధికారులు తెలిపారు. లోతైన దర్యాప్తులో నిందితుడి తో సంబంధాలు కలిగి ఉన్న యువతులు, డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర సభ్యులపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని NCB–HNEW అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఎలాన్ మస్క్ మరో అరుదైన రికార్డు

  టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. 700 బిలియన్ డాలర్ల పైచిలుకు నికర సంపద కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. టెస్లా పారితోషికానికి సంబంధించి కోర్టులో అనుకూల తీర్పు రావడంతో ఇటీవల ఆయన సంపద అమాంతం పెరిగింది .2018 నాటి టెస్లా పారితోషికానికి సంబంధించి ఇటీవల కోర్టులో అనుకూల తీర్పు వెలువడటంతో మస్క్ నికర సంపద 749 బిలియన్‌ డాలర్‌లకు చేరింది  2018లో టెస్లా సంస్థ మస్క్‌కు ఆఫర్ చేసిన పారితోషికాన్ని పునరుద్ధరిస్తూ డెలావేర్ సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.  ఈ ప్యాకేజీ చెల్లదంటూ అంతకుముందు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టేసింది. మస్క్‌కు పారితోషికం కింద కొన్ని స్టాక్ ఆప్షన్స్ ఇచ్చేందుకు టెస్లా బోర్డ్ 2018లో అంగీకరించింది. అప్పట్లో వీటి విలువ 56 బిలియన్ డాలర్లు.అయితే, ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ ఓ షేర్ హోల్డర్ కోర్టును ఆశ్రయించారు. ఈ ప్యాకేజీని ఆమోదించిన టెస్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మస్క్‌కు సన్నిహితులని ఆరోపించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. అంతటి పారితోషికాన్ని మంజూరు చేయడం అసాధారణమని, అది చెల్లదని తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో మస్క్ పైకోర్టును ఆశ్రయించారు.  2024లో సంస్థ షేర్ హోల్డర్‌లు మరోసారి ఈ ప్యాకేజీని అంగీకరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని రద్దు చేస్తే ఆరేళ్లుగా తను పడ్డ శ్రమ వృథా అయిపోతుందని అన్నారు. దీంతో, డెలావేర్ సుప్రీం కోర్టు మస్క్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇటీవలే టెస్లా బోర్డు మస్క్‌కు భారీ పారితోషికాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ పనితీరు మెరుగయ్యే కొద్దీ గరిష్ఠంగా ట్రిలియన్ డాలర్ల పారితోషికం చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. అయితే, ఈ మొత్తం అందాలంటే ఏఐ, రోబోటిక్స్, మార్కెట్ వృద్ధిలో టెస్లా సంస్థ కొన్ని లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం మస్క్ నికర సంపద విలువ 749 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మస్క్ తరువాతి స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నికర సంపద 500 బిలియన్ డాలర్లు.

ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

  ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్ల పై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్‌మెంట్లలో అత్యధిక మోసపూరిత టిక్కెట్స్ ను గమనించింది. రైల్వే పెరుగుతున్న డిజిటల్ మోసాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్ణయాత్మక చర్యలో భాగంగా రిజర్వ్ చేయని టిక్కెట్లను ఎలా ధృవీకరించాలో గణనీయంగా మార్చే కొత్త నియమాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది.  ఇటీవలి అప్‌డేట్‌లో భాగంగా ప్రయాణికులు ఇకపై తమ ఫోన్‌లలో రిజర్వ్ చేయని టిక్కెట్లను చూపించడంపై మాత్రమే ఆధారపడకూడదని భారతీయ రైల్వేలు ఒక నియమాన్ని రూపొందించాయి. బదులుగా, టికెట్ భౌతిక ప్రింటౌట్ ఇప్పుడు తప్పనిసరి. టెక్నాలజీ దుర్వినియోగం ద్వారా దోపిడీకి గురవుతున్న లొసుగులను మూసివేయడం లక్ష్యం.

గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ కోసం ఎంపీల వినతి

  గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రిని కోరారు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గుతుందని, అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. అలాగే, కొండపల్లి రైల్వే స్టేషన్ వద్ద నీటి సమస్యను పరిష్కరించి, రైళ్ల రాకపోకలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి నిర్ణయం కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గొల్లపూడి సమీపంలో శాటిలైట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. వినతిపత్రం సమర్పించారు.  గొల్లపూడిలో శాటిలైట్/హాల్ట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తే విజయవాడ రైల్వేస్టేషన్ పై భారం తగ్గుతుందని ఎంపీలు వివరించారు. ఈ శాటిలైట్ స్టేషన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం బల్బ్‌లైన్స్‌ చుట్టూ ఖాళీ స్థలాలున్నాయని, వాటిని రైల్వే అవసరాలకు సులభంగా సేకరించవచ్చని రైల్వేమంత్రికి వివరించారు. ఈ ప్రాంతం కొత్త రైలు, వాయుమార్గాలతో అనుసంధానం కానుందని.. అమరావతి రైల్వేలైన్ నిర్మాణం కూడా జరుగుతోందన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికి అన్ని సౌకర్యాలకు సెంటర్‌గా ఉంది కాబట్టి, గొల్లపూడిలో హాల్ట్/శాటిలైట్ స్టేషన్ నిర్మించాలన్నారు.  అంతేకాదు కొండపల్లి రైల్వేస్టేషన్ దగ్గర నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ వరకు రైల్వే ట్రాక్‌పై నీరు చేరకుండా నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఎంపీలు కోరారు. ఈ రెండు సమస్యల పరిష్కారం వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుండి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌పై మురుగునీరు, వర్షపునీరు నిలిచిపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారు వివరించారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఇక్కడ నీరు నిలిచిపోతోందని, దీనివల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రికి తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించడానికి, ట్రాక్‌ పక్కన డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు నిర్మించి వర్షపునీరు సులభంగా వెళ్లిపోయేలా చూడాలని వారు కోరారు. ఇందుకోసం వెంటనే నిధులు కేటాయించి, పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల వల్ల రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ప్రయాణికుల భద్రత కూడా మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఎంపీల ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ వెంట మురుగునీరు, వర్షపు నీరు నిల్వ అవుతున్న సమస్యలను కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి వివరించాను. వర్షాకాలంలోనే కాకుండా సాధారణ వర్షపాతం సమయంలో కూడా శాస్త్రీయంగా రూపొందించిన డ్రైనేజ్ నెట్వర్క్, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు, కాలువలు అనుసంధానం లేకపోవడం వల్ల ట్రాక్ వెంట మురుగు నీరు నిల్వ‌వుంటుంద‌ని తెలియజేశాను.. ఈ నీటి నిల్వల వల్ల స్థానిక నివాసితులు, పరిశ్రమలు ముఖ్యంగా కృష్ణ మిల్క్ యూనియన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపాను.  ఈ ప్రతిపాదనకు అమల్లోకి వస్తే విజయవాడ నగరంలో రైల్వే రవాణా మరింత సవ్యంగా మారడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, రైల్వే భద్రత, పరిశ్రమలు, స్థానిక ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఆశభావం వ్యక్తం చేశాను.. ఈ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు' అంటూ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.  ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలా రియాక్ట్  అవుతారో చూడాలి.

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు

  మాజీ మావోయిస్టు,  సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం మావోయిస్టులకు అనుకూలంగా మీడియాలో ఇంటర్వ్కూలు ఇవ్వడం, ఇటీవల చత్తీస్‌గఢ్‌లో  మవోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామానికి వెళ్లి రావడం  వంటి అంశాలపై విచారిస్తున్నారు.  మవోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నాందున ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి గాదే ఇన్నయ్యను  అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇటీవల మరణించిన మవోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియాలకు ఇన్నయ్య హాజరయ్యారు.