వేటగాళ్లకే జగన్ మద్దతు! జూన్ 4 తర్వాత మంచి రోజులు వస్తాయి
posted on May 25, 2024 @ 10:27AM
వైసీపీ నేతలు ఓటమి భయంతోనే హింసకు పూనుకున్నారు. జూన్ 4న బాక్సులు బద్దలైయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది అని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారులు భయపడాల్సిన అవసరంలేదు. లీవ్లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరంలేదు. నిష్పక్షపాతంగా పనిచేయాలి అని మహ్మద్ ఇక్బాల్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే రాష్ట్రంలో డబ్బుల పందేరంతో పాటు, అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడు. పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేటలతో పాటు చాలా చోట్ల విధ్వంసం, రక్తపాతం సృష్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి, పెద్దారెడ్డి లాంటి వేటగాళ్లకు మద్దతు తెలుపుతున్న జగన్ పాలనలో అరాచకాల గుట్టును ఆయన విప్పారు.
1. పిన్నెల్లి అరాచకం ప్రజలందరూ చూసినా గుర్తు తెలియని వ్యక్తులని 324 కేసు పెట్టడం దారుణం. వెంటనే 307 కేసు పెట్టి ఉంటే పిన్నెల్లికి బెయిల్ వచ్చేది కాదు. శేషగిరిరావును హత్య చేయాలని చూసినా కేసు పెట్టలేదు. వైసీపీ గుండాల అరాచకంతో శేషగిరిరావు ఊరి విడిచి పోలాల్లో ఉంటున్న పరిస్థితి వచ్చింది.
2. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యంగా 74 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు.
3. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులుకు తెగబడ్డారు.
4. వైసీపీ దాడులతో 100 ముస్లిం కుటుంబాలు సొంత ఊరు విడిచిపోయారు.
5. బీసీ వ్యక్తి చంద్రయ్యను సినిమా తరహాలో దారుణంగా గొంతుకోసి చంపారు.
6. నియోజకవర్గంలో పిన్నెల్లి ఇష్టానుసారంగా దోచుకున్నాడు. దాదాపు రూ. 2000 కోట్లు కొల్లగొట్టాడు. అడ్డు అదుపు లేకుండా భరితెగించి ప్రవర్తించాడు. తెలంగాణ బార్డర్ లో చెక్ పోస్టులు పెట్టి కమీషన్లు దండుకున్నాడు.
రక్తపాతం సృష్టించిన పిన్నెల్లి లాంటి నేతలను సౌమ్యశీలులు అంటున్న జగన్ రెడ్డి విజ్ఞత ఏమనాలని మహ్మద్ ఇక్బాల్ ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్ మెంట్లలో తాబేదారులను నియమించుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ప్రజాస్వామ్యంగా గెలవలేమని భావించి దండుకున్న డబ్బులను పంచి గెలవాలని జగన్ రెడ్డి కుట్ర చేశాడు. ఎర్రగొండపాలెం, పుంగనూరులో చంద్రబాబు పై దాడులు చేయించి మళ్లీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ మాత్రమే ఉండాలని ఎలక్షన్ జరగనివ్వకూడదని వైసీపీ నేతలు యత్నించారు. లేని కారుచిచ్చు రగిలించి రక్తపాతాన్ని సృష్టించారు. డీఎస్పీ చైతన్య లాంటి అధికారులు వంత పాడటంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ సానుకూల పరులు సొంత ఊరు విడిచి పోయిన పరిస్థితికి తెచ్చారు. జగన్ రెడ్డి అన్ని వ్వవస్థలను సర్వ నాశనం చేశాడు. విద్యావస్థను భ్రష్టుపట్టించి బైజూస్ కు వేల కోట్లు కట్టబెట్టి కమీషన్ లు దండుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు.
2019 నుండి 2024వరకు ఇసుక, మద్యంలో దోపిడీలపై రికార్డులను దగ్ధం చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవాలి. కిందిస్థాయి పోలీసులు భయపడకుండా ఎలక్షన్ కమిషన్ మనోధౌర్యం కల్పించాలి. కింది స్థాయిలో పోలీసులు డ్యూటీలకు వెళితే తిండిలేని పరిస్థితి ఉంది. లా ఆండ్ ఆర్డర్లను కలెక్టర్లు, ఎమ్మార్వోలు కూడా కాపాడాలి. ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి 307 కేసులు పెట్టించాలి.
అధికారులు తప్పులకు తావులేకుండా ఎలక్షన్ కౌంటిగ్ వద్ద నిర్భయంగా పనిచేయాలి. దాడులు చేసేవారిని ముందే పసిగట్టి శిక్షించాలి. ఒత్తిడిలో ఉన్న అధికారులు బయటకు రావాలి. జూన్ 4 తరువాత మంచిరోజులు వస్తాయి అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్.
- ఎం.కె. ఫజల్