పాదయాత్రలో చంద్రబాబు డబుల్ సెంచరి

 

చంద్రబాబు పాదయాత్రలో డబుల్ సెంచరి పూర్తి చేశారు. రెండు వేల కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో బాబు 200 కిలోమీటర్లు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం రేణుమాకులపల్లిలో ఆయన ఈ మైలురాయిని అధిగమించారు. ”వస్తున్నా మీకోసం” అంటూ భద్రత గురించి కూడా భయం లేకుండా చంద్రబాబు అందరితో మమేకం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ జిల్లాలో హిందూపురం, పెనుగొండ, రాప్తాడు, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సుమారు 90 గ్రామాలు సందర్శించారు. రేణుమాకులపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉచిత విద్యుత్ పేరిట కాంగ్రెస్ మోసం చేస్తు౦దని, వ్యవసాయానికి 9గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. సంచార జాతుల వారు రాజకీయంగా ఎదిగేందుకు టిడిపి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. చేనేత వర్గాల వారు కాంగ్రెస్ హయంలో ఆత్మహత్యలు చేసుకు౦టున్నారని, తమ హయంలో రాజికీయంగా న్యాయం చేసిన విషయం చంద్రబాబు వారికి గుర్తు చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.