జగన్ కి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్

 

కేంద్ర క్యాబినెట్ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయ్. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల లాబీయింగ్ జోరుగా సాగుతోంది. బెర్త్ కావాలనుకున్నవాళ్ల నేరుగా ఢిల్లీలో మకాం పెట్టి పైరవీలు చేసుకుంటున్నారు. మొదట్నుంచీ చిరంజీవి పేరు వినిపిస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంతంనుంచి ఓ వ్యక్తికి క్యాబినెట్ లో చోటు కల్పిస్తే ఉద్యమం ఉద్ధృతి కొంత తగ్గుతుందన్న ఆలోచనతో సర్వే సత్యనారాయణ పేరు పరిశీలనలోకొచ్చింది. ఎవరూ ఊహించడానిక్కూడా వీల్లేని విధంగా మరో వ్యక్తి పేరు తెరమీదికి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానంనుంచి పిలుపొచ్చింది. అంతేకాదు.. ఢిల్లీలో తమకి అందుబాటులో ఉండమని కూడా అధిష్ఠానం ఆదేశం. రాయలసీమలో బలమైన ప్రాబల్యం ఉన్న రెడ్లని తమవైపుకి తిప్పుకోవాలంటే యాంటీ వై.ఎస్ గ్రూప్ లో కాస్తో కూస్తో జనంలో పట్టున్న నేత అవసరం. సూర్యప్రకాశ్ రెడ్డిని పైకి లాక్కొస్తే యాంటీ జగన్ వేవ్ కూడా కలిసొస్తుందన్న కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం.  ముందునుంచీ కోట్ల కుంటుబానికీ, వై.ఎస్ కుటుంబానికీ మధ్య ఉన్న వైరాన్ని క్యాష్ చేసుకో గలిగితే రాయలసీమలో యాంటీ జగన్ గ్రూప్ కి చెందిన ఓ వ్యక్తి తమ చేతిలో ఉంటాడన్నది అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.