అవును వాళ్లిద్దరూ కొట్టుకుంటున్నారు : బొత్స

 

ముఖ్యమంత్రికీ, ఉప ముఖ్యమంత్రికీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోందన్న వార్తల్ని పిసిసి అధ్యక్షుడు తెలివిగా ధృవీకరించారు. మీడియాలో వస్తున్న వార్తల్ని చూసి తాను ఆ విషయం గురించి తెలుసుకున్నానంటూనే ఇద్దరిమధ్యా విభేదాలున్నాయన్న విషయాన్ని బైటపెట్టారు బొత్స. సింగూరు నీళ్ల విషయంలో ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేధాలు తారాస్థాయికి చేరినట్టు సమాచారం. దామోదర్ తండ్రి పేరిట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి మంత్రి సుదర్శన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు దాన్ని ఖండించకుండా ముఖ్యమంత్రి .. సుదర్శన్ రెడ్డికే వత్తాసు పలకడం డెప్యూటీ సీఎంకి ఏమాత్రం రుచించలేదు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్యా విభేధాలు బలం పుంజుకుంటూ వచ్చాయ్. చివరికి తన తండ్రి పేరు తీసేసినా ఫర్వాలేదు కానీ.. ఎత్తి పోతల పథకాన్ని మాత్రం ముందుకుతీసుకెళ్లాలని ఉపముఖ్యమంత్రి కోరినప్పటికీ సీఎం సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హమైన విషయమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన రాయబారంకూడా విఫలమైనట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.